ప్రభాస్ ‘సాహో’ ని ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ మీడియా ప్రతినిధితో చేసిన కామెంట్స్  పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతుంటే ప్రభాస్ చేసిన కామెంట్స్ అతడి అభిమానుల మధ్య తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ‘బాహుబ‌లి’ తో నేషనల్ స్టార్ ఇమేజ్ కి వెళ్లి పోయిన ప్రభాస్ తన స్థాయిని అదేవిధంగా కొనసాగించాలని రెండు సంవత్సరాల కష్టపడటమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ‘సాహో’ రిజల్ట్ గురించి ప్రభాస్ ఏవిధంగా టెన్షన్ పడుతున్నాడో అతడి మాటలు తెలియచేస్తున్నాయి.

ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధి ‘సాహో’ గ్యారంటీ హిట్ అని భావిస్తున్నారా అంటూ అడిగిన ప్రశ్న పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో ఫెయిల్యూర్ అతడి కోసం ఎదురు చూస్తూనే ఉంటుందని దానికితోడు ఇలాంటి భారీ సినిమాలు చేసాక భయం లేకుండా ఎలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. 

తాను ‘సాహో’ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డానని ఆ సమయం తన సినిమాల గురించి పెట్టి ఉంటే ఈసమయంలో తన వైపు నుండి నాలుగు సినిమాలు వచ్చి ఉండేవని అభిప్రాయ పడ్డాడు. అంతేకాదు ఈ మూవీ కోసం తనతో పాటు తన తోటి నటీనటులు టెక్నిషియన్స్ ఈ మూవీ కోసం పడ్డకష్టం వృధా అవుతుందా అన్న భయం తన ఆలోచనలోకి వస్తేనే భయంగా ఉంది అంటూ ప్రభాస్ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఈ మూవీని భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుక్కున్న రీత్యా వారందరూ లాభ పడాలని తన కోరిక అంటూ తన వల్ల ఎవరు నష్టపోయినా తాను భరించలేను అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ‘సాహో’ ఊహించిన విధంగా సూపర్ సక్సస్ అయినా కొద్ది సంవత్సరాల పాటు తాను ఇక ఇలాంటి భారీ సినిమాలు చేయనని ఇలాంటి భారీ సినిమాలు చేసి ఫలితం గురించి పడే టెన్షన్ భరించే శక్తీ తనకు లేదు అంటూ ప్రభాస్ చేసిన కామెంట్స్ ను బట్టి ‘సాహో’ రిజల్ట్ గురించి ప్రభాస్ ఎంత టెన్షన్ పడుతున్నాడో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: