ఈ సంవత్సరం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలు సాహో మరియు సైరా. నెల రోజుల గ్యాప్ తో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలపై భారదేశమంతటా మంచి అంచనాలున్నాయి. సాహో ఆగష్ట్ 30వ తేదీన విడుదలవుతుండగా సైరా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. సైరా సినిమాకు బాలీవుడ్ ప్రమోషన్ల విషయంలో ప్రభాస్ సాయం చేసాడని వార్తలు వస్తున్నాయి. 
 
బాహుబలి సినిమాతో బాలీవుడ్ కు పరిచయమయ్యాడు ప్రభాస్. ఆ సినిమా బాలీవుడ్లో హిట్ అయింది. బాహుబలి తరువాత వచ్చిన బాహబలి2 బాలీవుడ్లో ఘన విజయం సాధించింది. బాహుబలి సినిమాతో బాలీవుడ్ మీడియాకు ప్రభాస్ దగ్గరయ్యాడు. బాహుబలి సిరీస్ సినిమాలతో వచ్చిన గుర్తింపు ప్రభాస్ సాహో సినిమాకు బాగా హెల్ప్ అయింది. సాహో థియేట్రికల్ హక్కులు బాలీవుడ్లో 120 కోట్లకు విక్రయించారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ 85 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. 
 
బాలీవుడ్ మీడియాతో పరిచయం ఉండటంతో సైరా సినిమాకు ప్రభాస్ సాయం చేసినట్లు తెలుస్తోంది. సాహో సినిమా ప్రమోషన్ల సమయంలో ప్రభాస్ సైరా సినిమా గురించి కూడా మాట్లాడాడు. ప్రభాస్ సైరా గురించి మాట్లాడటం ఆ సినిమాకు హెల్ప్ అయింది. సైరా సినిమా ముంబాయిలో చేసిన ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభాస్ హెల్ప్ చేసాడని సమాచారం. రెండు రోజుల క్రితం విడుదలైన సైరా టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. 
 
ఈ సినిమాను 270 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మెగస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఈ సినిమాను హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: