అత్యంత భారీ అంచనాలతో దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘సైరా’ మూవీకి సంబంధించి ఎవరు ఊహించని ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ న్యూస్ లో ఎన్ని నిజాలు అని తెలుకోవడానికి ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా అభిమానులు కూడ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

‘సైరా’ మూవీకి రామ్ చరణ్ కేవలం తాను నిర్మాతను మాత్రమే అంటూ ఇప్పటికే స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. అయితే వాస్తవానికి జరిగిన విషయాలు వేరు అని అంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సురేంద్ర రెడ్డి ఈమూవీ రచయితలు పరుచూరి బ్రదర్స్ తో సంప్రదించి చరణ్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేసినట్లు టాక్.

ఈ పాత్ర ‘సైరా’ ఇంట్రవెల్ ముందు వచ్చేలా సురేంద్ర రెడ్డి తన స్క్రీన్ ప్లే లో కూడ పక్కాగా ఇముడ్చుకుని చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను చాలాకాలం క్రితమే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిరంజీవి పుట్టినరోజునాడు ప్రకటించి మెగా అభిమానులకు మరింత జోష్ ను ఇవ్వాలని సురేంద్ర రెడ్డి అప్పట్లో ఆలోచన చేసినట్లు టాక్.

అయితే ఈమూవీ మేకింగ్ అంతా పూర్తి అయ్యే సరికి ఈమూవీ నిడివి బాగా పెరిగిపోవడంతో ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన చిరంజీవి సూచనతో ‘సైరా’ లో రామ్ చరణ్ పాత్రను తీసివేసారు అంటూ తీవ్ర స్థాయిలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు ‘సైరా’ కథకు సంబంధించి చరణ్ కోసం క్రియేట్ చేయబడ్డ ఆపాత్ర అంత సహజంగా చిరంజీవికి అనిపించక పోవడంతో టోటల్ ప్రాజెక్ట్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే ‘సైరా’ ఎడిటింగ్ విషయంలో చిరంజీవి ఎంత ఖచ్చితంగా వ్యవహరించాడో అర్ధం అవుతుంది..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: