ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఒక్కటే.. సాహో.. సాహో చుట్టూనే సోషల్ మీడియా తిరుగుతున్నది.  సాహో గురించిన విషయాలు అందులో ట్రెండ్ అవుతున్నాయి.  ప్రభాస్ కు సంబంధించిన ఏ విషయం అయినప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి.  ఇటీవలే ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో అయన అనేక విషయాల గురించి మాట్లాడారు.  


బాహుబలి సినిమా సమయంలో సుజిత్ తీసిన రన్ రాజా రన్ సినిమా చూసి తనతో సినిమా చేస్తావా అని అడిగితె కథ రాసుకొచ్చి కలుస్తా అన్నాడట.  సుజిత్ కాన్ఫిడెన్స్ చూసి ప్రభాస్ షాక్ అయ్యాడు.  కథ రాసుకొని వచ్చిన తరువాత ప్రభాస్ కథ విని షాక్ అయ్యాడు. యూవీ క్రియేషన్స్ లో సినిమా స్టార్ట్ చేశామని చెప్పారు.  సుజిత్ స్క్రీన్ ప్లే బాగా రాయగలడు.. ఆ నమ్మకంతోనే సినిమా స్టార్ట్ చేసినట్టు చెప్పారు.  


సినిమా చేస్తున్న సమయంలో సుజిత్ కాన్ఫిడెన్స్ చూసి షాక్ అయ్యినట్టు ప్రభాస్ చెప్పారు.  అంతేకాదు యాక్షన్ సీన్స్ ను తీసిన తీరు అద్భుతం అని అన్నాడు.  బాహుబలి తరువాత చేస్తున్న సినిమా కావడం పైగా యాక్షన్ మూవీ కావడంతో కనీసం రూ.  150 కోట్ల రూపాయల బడ్జెట్ లో పూర్తి అవుతుందని అనుకుంటే.. అది అమాంతంగా పెరిగిపోయింది.  పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది అన్నాడు ప్రభాస్.  


తన మొదటి సినిమా ఈశ్వర్ తీసే సమయంలో తనను ఎవరైనా చూస్తారా.  తాను హీరోగా పనికొస్తానా అని అనేకసార్లు సందేహించినట్టు ప్రభాస్ పేర్కొన్నాడు.  హీరోగా గుర్తిస్తారో లేదో  అనుకున్నానని, ఇప్పుడు బాహుబలి తరువాత దానికి మించి కొత్తగా ఏం చూపించాలి.. ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా కొత్తగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నానని ప్రభాస్ పేర్కొన్నాడు. 

ఈశ్వర్ సమయంలో ఆలోచనకు.. బాహుబలి తరువాత ఆలోచనకు చాలా తేడా ఉందని అన్నారు.  సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్, రజినీకాంత్ లు ఎన్నో సినిమాలు నటించారు.  అయినప్పటికీ వారిలో కించిత్తు గర్వం కూడా ఉండదని.. దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోతారని ప్రభాస్ చెప్పడం విశేషం.  ఎంత ఎదిగినా వారిని టచ్ చేయలేమని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: