ప్రస్తుతం అల్లు అరవింద్ కు ఏదైనా సమస్య అంటూ ఉంటే శిరీష్ ను ఇంకా సక్సస్ ఫుల్ హీరోగా చేయలేకపోయాను అన్న అసంతృప్తి తప్ప అరవింద్ కు మరే అసంతృప్తి లేదు అని అంటూ ఉంటారు. శిరీష్ లేటెస్ట్ మూవీ ‘ఎబిసిడీ’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈ మూవీని నిర్మించిన నిర్మాత మధురా శ్రీధర్ కు విపరీతమైన నష్టాలు వచ్చాయి అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.

దీనితో శిరీష్ తో సినిమాలు తీయాలి అనుకునే నిర్మాతలు కనీసం ఆ ఆలోచనలు కూడ ప్రస్తుతం చేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో శిరీష్ ను హీరోగా నిలబెట్టాలని స్వయంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగి ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాను తీసి సూపర్ హిట్ కిట్టిన రమేష్ వర్మను పిలిచి శిరీష్ కోసం ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పమని కోరినట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా చిన్న సినిమాలు తీసి హిట్స్ కొట్టిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ ను శిరీష్ తో ఒక సినిమాను తీస్తే ఆ ప్రాజెక్ట్ వెనుక తాను ఉంటానని అరవింద్ సూచన ప్రాయంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నా తలపండిన అరవింద్ కు కూడ శిరీష్ కు హిట్ ఇవ్వడం సమస్యగా మారింది అని అంటున్నారు. 

ప్రస్తుతం ‘గీతాగోవిందం’ డైరెక్టర్ పరుశు రామ్ ఖాళీగా ఉన్న నేపధ్యంలో టాప్ హీరోల ప్రాజెక్ట్ సెట్ అయ్యేలోపు శిరీష్ తో ఒక సినిమాను తీయవచ్చు కదా అంటూ అరవింద్ పరుశు రామ్ కు సలహాలు ఇస్తున్నా పరుశు రామ్ దృష్టి అంతా మహేష్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. పట్టువదలని విక్రమార్కుడిలా హిట్ కోసం పరితపిస్తున్న శిరీష్ జాతకం అరవింద్ కు కూడ పూర్తిగా అర్ధం కావడం లేదు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: