హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన నాల్గవ సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇక ఈసినిమా లో నటించే హీరోయిన్ విషయంలో ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. అయితే ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ముంబై బ్యూటీ పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాతోనైనా కెరీర్ లో మొదటి హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలగా వున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అఖిల్ ఇప్పుడు మరో సినిమా కు కూడా ఓకే చెప్పాడు. అవె ఫేమ్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ అఖిల్ కు బాగా నచ్చడంతో తన 5వ సినిమాను అతనితో చేయనున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈచిత్రం లో నివేత థామస్ హీరోయిన్ గా నటించనుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో అఖిల్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు లవర్ బాయ్ గా ఒకే జోనర్ లో సినిమాలను చేసిన అఖిల్ ఈసినిమాకు మాత్రం డిఫ్రెంట్ జోనర్ ను ఎంచుకున్నాడు. మరి ఈ సినిమా అఖిల్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.