మరికొద్ది గంటలలో ‘సాహో’ విడుదలకాబోతున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘సాహో’ మ్యానియానే కనిపిస్తోంది. ఈమూవీ టిక్కెట్స్ కోసం రాజకీయ నాయకుల నుండి సామాన్యుల వరకు తమ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులలో  ఈమూవీ మొదటిరోజు మొదటి షో టికెట్ దొరికినవాడు ప్రస్తుతం ఒక గొప్ప అదృష్ట జాతుకుడిగా ఫీల్ అవుతున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ విడుదలకాబోతున్న థియేటర్స్ వద్ద జరుగుతున్న హడావిడి ఒక పండగ వారావరణం లాఉంది. 1200 వందల రూపాయలు ఇచ్చి టిక్కెట్ కొందామని అన్నా టిక్కెట్ దొరకని పరిస్థితి. ఇక ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో అయితే ఈ మ్యానియా ఊహకందని తారా స్థాయికి చేరుకుంది. 

ప్రస్తుతం భీమవరంలోనే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ చూసినా ప్రభాస్ ‘సాహో’ బ్యానర్లు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎక్కడ చూసినా ప్రభాస్ భారీ ఫ్లెక్సీల హడావిడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భీమవరంలోని ఒక కీలక సెంటర్ లో ఏకంగా  200 అడుగుల‌ వెడ‌ల్పుతో ఫ్లెక్సీ పెట్ట‌డం హాట్ న్యూస్ గా మారింది. ఇప్ప‌టిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఇంత పొడ‌వైన ఫ్లెక్సీ ఎవ‌రూ పెట్టలేదు అని అంటున్నారు. ఈ మ్యానియా అంతా చూస్తూ ఉంటే రేపటి ‘సాహో’ ఓపెనింగ్ కలక్షన్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అన్న సంకీతాలు వస్తున్నాయి. 

అయితే ఈ మూవీని దెబ్బ తీయాలని  అనేకమంది చేస్తున్న ప్రయతాలకు ప్రభాస్ వీరాభిమానులు ఎంత వరకు అడ్డుకట్ట వేయగలరు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. అంచనాలకు అనుగుణంగా ‘సాహో’ రికార్డులను సృష్టించగలిగితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలోకి ప్రభాస్ వెళ్ళిపోతాడు. అయితే ఇది అంతా రేపు ఈసినిమాకు రాబోయే తొలి టాక్ పై ఆధారపడి ఉంటుంది. దీనితో ప్రభాస్ వీరాభిమానులు ఈ అర్దరాత్రి సమయానికే దుబాయ్ నుండి తెలియబోతున్న ఈమూవీ తొలి టాక్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: