సినిమా స్టార్లు ఏ బ్రాండ్ కు ప్రమోషన్ చేసినా వాటిపై జనాలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మన దేశంలో ఏదైనా ఓ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్లాలంటే సినిమా స్టార్లు, క్రెకెటర్లపై ఆధారపడుతూంటాయి ఆయా కంపెనీలు. అభిమాన స్టార్స్ ఆయా ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేయడంతో.. ఈ ప్రోడక్ట్ మనం వాడాల్సిందే అనేంతగా అభిమానులు కనెక్ట్ అయిపోతారు. ప్రస్తుతం ఓ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసే పనిలో మన హాట్ బ్యూటీ హీరోయిన్స్ కొందరు బిజీగా ఉన్నారు. మనుషుల కోసం కాదు సుమా.. పెట్ డాగ్స్ కోసం.

 


పెట్ డాగ్స్ కోసం తయారు చేసిన చికెన్ అండ్ ఎగ్ నగ్గెట్స్ ను హాట్ బ్యూటీలతో ప్రమోట్ చేయాలని భావించింది డ్రూల్స్ అనే కంపెనీ. దీంతో వారి పెంపుడు కుక్కలతో హీరోయిన్లు ఫోజులిచ్చి ఈ బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఈ చికెన్ అండ్ ఎగ్ నగ్గెట్స్ తో మా పప్పీలు ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నాయి. మీరు కూడా మీ పప్పీస్ కోసం ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టండి’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఈ నగ్గెట్స్ ను ప్రమోట్ చేసినవారిలో జాక్వెలైజ్ ఫెర్నాండెజ్, సమంతా, రకుల్ ప్రీత్ సింగ్, దిశా పటాని, నేహా శర్మ, పూజా హెగ్డే తో సహా పలువురు హాట్ బ్యూటీలున్నారు. దీంతో పెట్ డాగ్స్ ఫుడ్ కు ప్రచారం మహ బాగా జరుగుతోంది.

 


ఇళ్లలో పెంచుకునే క్వాలిటీ బ్రీడ్ పెట్ డాగ్స్ ను అందరూ ఎంతో మురిపెంగా చూసుకుంటూంటారు. మెడికల్ గా ఎంతో కేర్ తీసుకుంటూ క్వాలిటీ ఫుడ్ పెడుతూంటారు.. అలాంటి వారికి ఈ హాట్ బ్యూటీల ప్రచారం బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: