కింగ్ నాగార్జున పుట్టినరోజు వేడుకల కోసం స్పెయిన్ కి వెళ్లడంతో శనివారం, ఆదివారం ప్రత్యేక హోస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ ఎలిమినేషన్ ప్రక్రియని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆరో వారంలో ఎలిమినేషన్ లో ఉన్న మహేశ్, పునర్నవి, హిమజలు ముగ్గురు సేఫ్ అయినట్లు చెప్పి ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పారు. ఇక వీకెండ్ రమ్యకృష్ణతో సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో కూడా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులని కన్ఫెషన్ రూములోకి పిలిచి సరికొత్త విధానంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు.


అలా రవి-అలీ, రాహుల్-మహేశ్, వితిక-పునర్నవి, బాబా భాస్కర్-శ్రీముఖి , శివజ్యోతి-హిమజలు జంటలుగా రాగా, కెప్టెన్ వరుణ్ ఒక్కడే వచ్చాడు. అయితే వీరందరితో లోపల చీకటిలో ఓ లేడీ మాట్లాడి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టింది. నేను మీ మిస్టరీ ఫ్రెండ్ అని చెబుతూ ఇంటి సభ్యులతో మాట్లాడింది. అలాగే ఎలిమినేషన్ కు నామినేట్ చేసే ఇద్దరి పేర్లని కూడా చెప్పాలని కోరింది. ఈ క్రమంలో కన్ఫెషన్ రూంలోకి వచ్చిన బాబా భాస్కర్, శ్రీముఖి కాసేపు కోతి చేష్టలతో నవ్వు తెప్పించారు. వాళ్లతో మిస్టరీ ఫ్రెండ్ గొంతు మార్చి మాట్లాడింది.


ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ మిస్టరీ ఫ్రెండ్ ఇంటిలోకి అడుగుపెట్టి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ మిస్టరీ ఫ్రెండ్ ఎవరో కాదు ప్రఖ్యాత తెలుగు యాంకర్ శిల్పా చక్రవర్తి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తాను షోలోకి వచ్చినట్టు అందరికీ శిల్పా చెప్పింది. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పువ్వులు పూసాయి. అందరితో పరిచయాలు అయిపోయాక.. శ్రీముఖి తనను గుర్తుపట్టేస్తుందనే భయంతోనే గొంతు మార్చి మాట్లాడానని శిల్పా చెప్పింది. 


శిల్పా ఇంటిలోకి అడుగుపెట్టడమే ఇద్దరు సభ్యులని నామినేట్ చేయాలని బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు కాబట్టి అలీని, బలమైన కంటెస్టంట్ గా ఉందని శ్రీముఖి పేర్లని చెప్పింది. శిల్పా కంటే ముందు ఇంటి సభ్యులు నామినేట్ చేసిన పేర్లతో  కలిపి మొత్తం ఐదుగురు మహేశ్, రాహుల్, అలీ, రవి, శ్రీముఖిలు ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: