టాలీవుడ్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక ముంబయ్ లో చక్కర్లు కొడుతున్నారు. నిన్న ముంబయ్ లోని ఓ హోటల్ లో వీరు హల్ చల్ చేశారు. ఇదంతా వేరే వేరే అర్ధాలు దారి తీయడానికి కాదు.. నిజంగానే వీరు ముంబయ్ లో కలిసి షికారు చేశారు. కారణం వీరిద్దరూ కలిసి ఇటివల నటించిన డియర్ కామ్రేడ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ముంబయ్ వెళ్లారు. దీంతో వీరిద్దరి ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

 


ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ అండ్ బ్యూటీ పెయిర్ ఎవరంటే విజయ్ దేవరకొండ – రష్మిక పేర్లు వినిపిస్తాయి. ఎన్నో అంచనాల మధ్య దక్షిణాది భాషలన్నింటిలో గ్రాండ్ గా విడుదలైన డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే ఇటివల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో, పీవీఆర్ సినిమాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకు వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. సినిమాలో ఉన్న కంటెంట్ గురించి వారు బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా కథ నచ్చి బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావించాడు. రీమేక్ హక్కులు కూడా కొన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

 


మొత్తానికి కరణ్ జోహార్ ద్వారానే విజయ్ బాలీవుడ్ లోకి లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. కాకపోతే ముందు అనుకున్నట్టు డియర్ కామ్రేడ్ కథ కాకుండా మరో కథతో వెళ్దామని కరణ్ కు విజయ్ సూచించాడని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకూ ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: