వి6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తల తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు యాంకర్ కమ్ ఆర్టిస్ట్ ,బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి. దాదాపు 3 సంవత్సరాల కు పైగా ఈ షో హావ కొనసాగింది. ఈషో దెబ్బకి ఛానెల్ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. యూట్యూబ్ లో కూడా తీన్మార్ వార్తలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఇక ఈ షో తెచ్చిన ఫేమ్ తో సత్తికి పలు సినిమాఆఫర్లు కూడా వచ్చాయి. ఇటు షో చూసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు సత్తి. అయితే ఇటీవల తీన్మార్ యాంకర్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి , జ్యోతి బిగ్ బాస్ 3 షో కోసం వి6 కు గుడ్ బై చెప్పగా ఆ తరువాత సత్తి కూడా ఛానల్ నుండి బయటికి వచ్చేసి అందరికి షాక్ ఇస్తూ వారం రోజుల కిందట టీవీ9 లో చేరాడు. కాగా సత్తి చేరిక ఫై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇక టీవీ 9 లో చేరాక ఈసారి ఎలాంటి ప్రోగ్రాం తో సత్తి అలరిస్తాడోనని అతని అభిమానులు ఎదురుచూసారు. వినాయకచవితి రోజు' ఇస్మార్ట్ న్యూస్' అనే పోగ్రామ్ తో సత్తి జర్నీ స్టార్ట్ అయ్యింది. తీన్మార్ వార్తల లాగానే తెలంగాణ యాస లో వార్తలు చెప్పి ప్రేక్షకులను నవ్వించడం ఈ షో కాన్సెప్ట్. అయితే ఇస్మార్ట్ న్యూస్ మొదటి ఎపిసోడ్ కే మిశ్రమ స్పందన లభించింది. ఇక ఆతరువాత ప్రసారమైన ఎపిసోడ్ లకు కూడా ఇలాంటి రెస్పాన్సే వచ్చింది.
ముఖ్యంగా కామెంట్లు అన్ని నెగిటివ్ రావడం షో నిర్వహుకులను కలవరపెట్టే విషయం. ఇక ఇది ఇలానే కొనసాగితే షో కొనసాగించడం కూడా కష్టమే... మరి తీన్మార్ వార్తల్లో లాగా సత్తి ఇకముందైనా తన మ్యాజిక్ ను రిపీట్ చేసి ఈ ఇస్మార్ట్ న్యూస్ ను కూడా అదే తరహాలో సూపర్ హిట్ చేస్తాడో లేదో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: