పెళ్లి తరువాత సమంత వరసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నది.  అయితే, భర్త చైతన్య మాత్రం ఈ విషయంలో వెనకబడ్డాడు.  వరసగా ప్లాప్ లు ఇస్తున్నాడు.  దీంతో చైతన్యతో కలిసి సామ్ మజిలీ సినిమా చేసింది.  ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తరువాత చైతన్య కథ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  ఒకటికి రెండు సార్లు అలోచించి సినిమా చేసేందుకు ఒకే చేస్తున్నారు.  


కొన్ని రోజుల క్రితం స్పెయిన్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన సామ్.. చైతులు తిరిగి ఇండియా వచ్చారు.  వెంకిమామ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నది.  ఈ సినిమా తరువాత చైతు ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి తో సినిమా చేయబోతున్నారని టాక్ వస్తున్నది.  ఈ కథను ఇటీవలే చైతూకు చెప్పారట.  ఆయనకు బాగా నచ్చింది.  


ఇదే కథను సమంత కూడా విన్నది.  ఆమెకు చాలా చాలా బాగా నచ్చిందట.  దీంతో ఈ సినిమా చేయాలనీ చైతుపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.  కథ చాలా బాగుందని, తప్పకుండా సినిమా చేయాలని సామ్ చైతూకి చెప్పినట్టు తెలుస్తోంది.  చైతు కూడా ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం.  గతంలో ఈ కథను రవితేజకు చెప్పారట.  ఆయనకు నచ్చింది.  కానీ, రెమ్యునరేషన్ కారణంగా రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం.  


అయితే, ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు బయటకు రావాల్సి ఉన్నది.  ఆర్ఎక్స్ 100 సినిమా హిట్టయ్యాక ఇప్పటి వరకు మరో సినిమా చేయకపోవడం విశేషం.  అనేక మంది టాలీవుడ్ హీరోలు కథలు విన్నా కూడా ఎవరు సినిమాలో నటించేందుకు ముందుకు రాకపోవడం విశేషం.  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సొంత బ్యానర్లోనే చేయబోతున్నారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: