ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న  తాజా చిత్రం  వాల్మీకి.  మెగా హీరో  వరుణ్ తేజ్ , తమిళ హీరో  అథర్వ మురళి  ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న ఈ సినిమా కి స్టార్  అప్పీయరెన్స్ ను కూడా జోడిస్తున్నాడు హరీష్.  అందులో భాగంగా   స్టార్ డైరెక్టర్  సుకుమార్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనుండగా  యంగ్ హీరో నితిన్  కూడా  అతిథి పాత్రలో మెరవనున్నాడు.  దానికి సంబందించిన  షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. 




ఇకవీరితో పాటు లెజండరీ కమెడియన్  బ్రహ్మనందం కూడా  ఈ సినిమాలో  ఓ చిన్న రోల్ లో కనిపించనున్నాడు.  మరి ఇంత మంది  స్టార్లు గెస్ట్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. కోలీవుడ్ లో విజయం సాధించిన  'జిగర్తండా' అనే సినిమాకి  రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో  బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్ నటిస్తుండగా  సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ  హీరో అథర్వ మురళి కనిపించనున్నాడు.  వీరికి  జోడిగా  పూజా హెగ్డే , మృణాళిని రవి  నటిస్తున్నారు.  కాగా అథర్వ -మృణాళిని కి తెలుగులో ఇదే మొదటి సినిమా. 




ఇక వీరితోపాటు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.  నిన్నటి తో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదలవుతుంది.  అయితే అదే రోజు సూర్య, బందోబస్త్ విడుదలవుతున్న కూడా ఆ సినిమా కు పెద్దగా హైప్ లేకపోవడం  వల్ల వాల్మీకికి నష్టం జరిగే అవకాశం లేదు. 14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్న ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక దువ్వాడ జగన్నాథం తరువాత  చాలా గ్యాప్ తీసుకొని  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం  విజయం సాధించడం హరీష్ శంకర్ కు కీలకం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: