ఫిదా బ్యూటీ  సాయిపల్లవి వరంగల్ లోని పరకాల బస్టాండ్ లో వెళ్లి కూర్చుంది.  అక్కడే  బస్ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులలో కలిసి పోయింది. అక్కడికి ఆమె సాధారణ దుస్తుల్లో రావడంతో ఎవరు గుర్తుపట్టలేకపోయారు.  ఇదెంత ఎందుకు చేయాల్సి వచ్చిందటే విరాటపర్వం కోసం.  సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.






షూటింగ్ లో భాగంగా  అక్కడ  ఓ సన్నివేశాన్ని  తెరకెక్కించాల్సి వచ్చింది. అయితే  అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిసీ చిత్ర యూనిట్ ఈ సన్నివేశాలను  బస్టాండ్ కు ఎదురుగా వున్నా లాడ్జ్ నుండి  సీక్రెట్ గా చిత్రీకరించారు.  కాగా  అక్కడున్న ప్రయాణికుడు  సాయి పల్లవిని గుర్తు పట్టి   వీడియో తీశాడు.  దాంతో ఆమె , సాయి పల్లవి అని అక్కడున్నవారికి తెలిసేలోపు  షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్లిపోయింది. ఆ ప్రయాణికుడు తీసిన  ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. 






ఇక ఈచిత్రం యొక్క   నెక్స్ట్ షెడ్యూల్  కాళేశ్వరం లో  జరుగనుంది.  రూరల్  బ్యాక్ డ్రాప్ లో తెరెక్కుతున్న చిత్రం కావడంతో  రియలిస్టిక్ గా ఉండడానికి  ఈలోకేషన్స్ లో షూట్ చేస్తున్నాడు దర్శకుడు.  ఈ చిత్రంలో సాయి పల్లవి  మారు మూల పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.  'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  రానా హీరో గా నటించనుండగా  నందిత దాస్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్  ఎల్ వి సినిమాస్ బ్యానర్ల ఫై సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం  ఈఏడాది చివర్లో విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: