షూటింగ్ లో భాగంగా అక్కడ ఓ సన్నివేశాన్ని తెరకెక్కించాల్సి వచ్చింది. అయితే అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిసీ చిత్ర యూనిట్ ఈ సన్నివేశాలను బస్టాండ్ కు ఎదురుగా వున్నా లాడ్జ్ నుండి సీక్రెట్ గా చిత్రీకరించారు. కాగా అక్కడున్న ప్రయాణికుడు సాయి పల్లవిని గుర్తు పట్టి వీడియో తీశాడు. దాంతో ఆమె , సాయి పల్లవి అని అక్కడున్నవారికి తెలిసేలోపు షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్లిపోయింది. ఆ ప్రయాణికుడు తీసిన ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇక ఈచిత్రం యొక్క నెక్స్ట్ షెడ్యూల్ కాళేశ్వరం లో జరుగనుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరెక్కుతున్న చిత్రం కావడంతో రియలిస్టిక్ గా ఉండడానికి ఈలోకేషన్స్ లో షూట్ చేస్తున్నాడు దర్శకుడు. ఈ చిత్రంలో సాయి పల్లవి మారు మూల పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా హీరో గా నటించనుండగా నందిత దాస్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ల ఫై సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.