టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వాసంత్రం సమరయోధుడుగా చెప్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ ఈ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని 250 కోట్ల వ్యయంతో నిర్మించారు. బాలీవుడ్ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు తమన్నా, జగపతిబాబు, రవి కిషన్ కూడా నటించారు.

నరసింహారెడ్డి జీవిత భాగస్వామిగా క్వీన్ ఆఫ్ సినీ ఇండస్ట్రీ నయనతార హీరోయిన్ గా నటించింది.భారీ అంచనాల మధ్య విడుదలకి సిద్దమైన ఈ  సైరా నరసింహారెడ్డి  అక్టోబర్ 2న విడుదలకి సిద్ధమౌతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలతో సైరాపై అన్ని ఇండస్ట్రీస్ లోనూ బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుందంటున్నారు. దసరా హాలిడేస్ టైమ్ లో ఈ సినిమా వస్తోంది కాబట్టి, భారీ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అని చెప్పొచ్చు.

సైరా రిలీజ్ కి ఇంకా 25 రోజుల టైమ్ మాత్రమే ఉంది. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ నెల 15 లేదా 17న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని, కర్నూల్ లో నిర్వహించనుందని సమాచారం. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లను గెస్ట్ లుగా పిలిచే ఆలోచనలో ఉన్నారు. లక్షలాది అభిమానుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అలాగే బెంగుళూరులోనూ ఓ పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట. వీటితో పాటు చిరంజీవి అండ్ టీమ్ ముంబయి, బెంగళూరు, కొచ్చి, చెన్నైలలో ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఏదేమైనా సాహూ మూవీ తోలి రోజు వచ్చిన నెగటివ్ టాక్ సైరా కి రాకుండా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.అలాగే ప్రొమోషన్స్ ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీగా చేయాలనీ ఆలోచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: