యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో నెగటివ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో బాహుబలిని మించి ఉంటుంది అని ఊహించారు. కానీ, ఈ సినిమా భారీగా అయితే ఉంది కాని , బాహుబలిని మీంచే సినిమా కాకపోవడంతో మొదటి షో  నుండే  అభిమానులు సాహో పై పెదవి విరిచారు. ఈ సినిమాని యువీ క్రియేషన్స్ 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు అని ఎన్నో అంచనాలతో  థియేటర్స్ లోకి వెళ్లిన అభిమానులు ..అక్కడ కేవలంభారీ తనం కేవలం ఫైట్స్ కి మాత్రమే కనిపించడం తో సినిమా కొద్దిగా తేలిపోయింది అని చెప్పాలి.

ఇకపోతే నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ..సాహో పై ఉన్న అంచనాలు..బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా ఇదే కావడం తో సాహో కలెక్షన్స్ పరంగా అందరిని సాహో రే  సాహో అనేలా చేస్తుంది. కేవలం నాలుగు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 350కోట్లకి పైగా కలెక్ట్ చేసి బిగెస్ట్ బంపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్  నేషనల్ హీరోగా మరో అడుగు ముందుకేసాడు అని చెప్పవచ్చు. అలాగే కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న సుజిత్ కి ఈ అవకాశం దక్కడం కూడా ఒక అద్భుతం అని చెప్పాలి.

ఇప్పటికే నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ..ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ కి అవకాశం ఇచ్చి తప్పుచేసాడు అని కొందరు విమర్శిస్తున్న తరుణంలో ప్రభాస్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు అని తెలుస్తుంది. అదేమిటంటే.. ఇప్పటికే సుజిత్ ని నమ్మి సాహో చేసాడు అని అంటున్న తరుణంలో ...సుజిత్ త్వరలోనే మరో అవకాశం ఇవ్వనున్నారు అని తెలిస్తుంది.  ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జాన్ సినిమా అయిపోగానే మళ్ళీ సుజిత్ తో సినిమా చేయబోతున్నాడని.. ఆ సినిమాకి సంబంధించిన కథా కథనాలు ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం.

అలాగే ఈ సినిమాని సాహో రేంజ్ లో కాకుండా 100 కోట్ల లోపు బడ్జెట్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నారు యువీ క్రియేషన్స్ వారు. అలాగే ఈ సినిమాలో కూడా ప్రభాస్ సరసన బాలీవుడ్ భామనే నటింపజేయలని చూస్తున్నారు. అసలు ఒక్క సినిమా దెబ్బ కొట్టిన తరువాత కూడా సుజిత్ కి మరో అవకాశం ఎవ్వబోతున్నాడు అంటే నిజంగానే ప్రభాస్ ది బాహుబలి గుండె అని చెప్పాలి. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సినిమాలో నటించే నటీనటుల ఎంపిక చేస్తునట్టు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా అయినా సుజిత్ కి బ్రేక్ ఇస్తుందేమో ...
 


మరింత సమాచారం తెలుసుకోండి: