విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్  నాగ చైతన్య నటిస్తున్న  లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ  వెంకీమామ. నిజ జీవితంలో  మామ, అల్లులు అయినా వీరిద్దరు  ఈసినిమాలోకూడా  ఆ పాత్రల్లోనే కన్పించనుండడంతో  సినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.  ఇక ఈచిత్రాన్ని  దసరా బరిలో నిలుపాలనుకున్నారు కానీ అదే సమయంలో  మెగా స్టార్ చిరంజీవి  నటించిన పీరియాడికల్ మూవీ  సైరా  కూడా విడుదలకానున్నడంతో వెంకీ మామ ను వాయిదా వేశారు. 



అయితే ఇప్పుడు ఈసినిమా  రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు గా వార్తలు వస్తున్నాయి.  దసరా ను మిస్ చేసుకున్న వెంకీ మామ టీం  దీపావళిని  టార్గెట్ చేసింది.  అందులో భాగంగా ఈసినిమా ను అక్టోబర్ 25న  విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారట.  ఇక ఆ సమయంలో తెలుగులో  పెద్ద సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా  వెంకీ మామ కు కలిసి రానుంది.  త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.  జై లవకుశ ఫేమ్  బాబీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా  నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నా నటిస్తుంది. 



సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల ఫై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఇక ఇటీవల వెంకటేష్ ,ఎఫ్ 2 తో నాగ చైతన్య ,మజిలీ సినిమాలతో  సూపర్ హిట్లు కొట్టి  ఫామ్ లోకి వచ్చారు.  మరి ఈ సినిమా వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: