సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల మరణం షాక్ నుండి తేరుకుని డిజైన్ చేస్తున్న ఒక భారీ మల్టీ స్టారర్ కు మహేష్ ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ని వార్తలు వస్తున్నాయి. వయసు పైబడిన రీత్యా సినిమాలకు దూరమైన కృష్ణ తన చివరి సినిమాగా ఒక భారీ మల్టీ స్టారర్ లో మహేష్ తో కలిసి నటించాలని ఎప్పటి నుంచో ఉబలాట పడుతున్నాడు. 

అయితే సరైన కథ దొరకాలి అన్న నెపంతో మహేష్ ఇప్పటి వరకు తన తండ్రి కృష్ణ ఆలోచనలను వాయిదా వేస్తూ వాస్తున్నాడు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అక్కినేని ‘మనం’ తీరులో ఘట్టమనేని కుటుంబ చిత్రానికి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ ప్రాజెక్ట్ కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించ బోతున్నాడని దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులలో వంశీ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు టాక్. ‘మనం’ సినిమాలాగే ఈ మూవీ కథ కూడ పునర్జన్మల చుట్టూ అల్లబడి కృష్ణ మహేష్ గౌతమ్ ల మధ్య తిరిగేలా వంశీ పైడిపల్లి స్క్రీన్ ప్లే రాస్తున్నట్లు సమాచారం. 

ఈ భారీ మల్టీ స్టారర్ లో మహేష్ అక్క మంజుల బావ సుధీర్ బాబు విజయనిర్మల కొడుకు నరేశ్ నమ్రత లకు కూడ అతిథి పాత్రలు ఉండేలా ఈ కథను వంశీ డిజైన్ చేస్తున్నట్లు టాక్. ‘మహర్షి’ మూవీ తరువాత మహేష్ మరొక సినిమాను వంశీ పైడిపల్లి తో చేస్తాను అని మాట ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు వంశీ సూచనతో ఈ ఘట్టమనేని మల్టీ స్టారర్ పట్టాలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగ జరిగితే సూపర్ స్టార్ కృష్ణ ఈ భారీ మల్టీ స్టారర్ తో తన నటనకు గుడ్ బై చెప్పాలని కృష్ణ ఆలోచన అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: