తెలుగు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లలో క్యూట్ గర్ల్ సమంత కూడా  ఒకరు. ఎం మాయ చేసావే.. సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఫెయిల్యూర్ అనే నట ఎక్కడా రాలేదని చెప్పాలి. ఈమె అందంతో  వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే అక్కినేని నాగచైతన్యను పెళ్లిచేసుకొని అక్కినేని వారి కోడలైంది.
ఇక సామ్ సినిమాలకు దూరంగా ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. వారందరికి షాక్ ఇస్తూ సినిమాలలో నటిస్తూ వచ్చింది.

పెళ్ళైన తరవాత అదృష్టం లక్కలాగా పట్టుకుందన్నట్లు ఆమె చేసిన ఏ సినిమా అయినా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. రంగస్థలం , మజిలీ , ఓ బేబీ వంటి చిత్రాలలో నటించి హిట్ ట్రాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె మరో భారీ ప్రాజెక్టులలో నటిస్తుంది. 

ఇది ఇలా ఉండగా ఆమె పిల్లలకి కనాలనుకుందని , ఆ మధ్య ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో షికారు చేసింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయినా సామ్ కు ఈ ప్రశ్న ఎదురైంది  దానికి స్పందించిన సామ్ అవన్నీ కేవలం రూమర్లే అని తోసిపుచ్చింది.. నిజం చెప్పాలంటే నాకు అటువంటి ఆలోచనలు ప్రస్తుతానికి లేవని చెప్పింది.
మీరు ఏ సినిమా చేసిన కూడా సూపర్ హిట్ అవ్వడంతో కాయం మరి మీరేమంటారు అని అడగగా..అలా సక్సెస్ అవ్వడానికి కారణం నన్ను అంతగా ఆదరించే అభిమానులు.

వాళ్ళు చూపించిన ఆదరణ నన్ను ఆ స్థాయిలో కుర్చోపెట్టింది అని సామ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాలు అయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకొని అక్కినేని కుటుంబానికి వారసుడు పుట్టుకా మల్లి సినిమాలలో నటిస్తుందని మాటలు వినిపిస్తున్నాయి మరి ఆ మాట ఎంతవరకు నిజాంపేట్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈమె జాలి ట్రిప్ కోసం స్పెయిన్ లో ఉంది. ఆ ట్రిప్ అయ్యాక రెండు సినిమాలలో నటిస్తుందని సమాచారం. అంతేకాకుండా వెబ్ సిరీస్లో కూడా నటించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: