టాప్ హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో తాము నటించి విడుదలయ్యే ప్రతి సినిమాను  బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు వల్ల టాప్ హీరోలు నటించే తమ సినిమాల విడుదల మధ్య చాల గ్యాప్ ఏర్పడుతోంది. 

ఒకొక్కసారి టాప్ హీరోలకు సంబంధించి మూవీ విడుదల లేకుండానే ఆ సంవత్సరం పూర్తి అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోలు తమ ఇమేజ్ తమ అభిమానుల మధ్య తగ్గిపోకుండా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను వారి లేటెస్ట్ సినిమా విశేషాలను షేర్ చేస్తూ ఉండటానికి ఒక ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ను పెట్టుకుని వారికి భారీ పారితోషికాలు కూడ ఇస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో మహేష్ కోసం నమ్రత ప్రత్యేకంగా ముంబాయి నుంచి తీసుకు వచ్చి ఏర్పాటు చేసిన పిఆర్ టీమ్ అత్యుత్సాహం పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ సమయంలో కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మహేష్ ను కలిసిన వార్తలు అదేవిధంగా మహేష్ ను రాజకీయాలలోకి రమ్మని కొన్ని రాజకీయ పార్టీల అధినాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వార్తల లీకులు ఇవ్వడం ఇది అంతా మహేష్ పిఆర్ టీమ్ అత్యుత్సాహమే అని అంటున్నారు. 

వాస్తవానికి మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ అప్ డేట్స్ ఇవ్వకుండా ఇలా ఎదో ఒక సంచలన వార్త మహేష్ గురించి క్రియేట్ చేస్తూ మహేష్ టాలీవుడ్ సూపర్
స్టార్ అని అనిపించే విధంగా జరుగుతున్న ఈ ప్రచారం యొక్క అర్ధం ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత మహేష్ పిఆర్ టీమ్ మరింత యాక్టివ్ గా మారడంతో రాబోతున్న రోజులలో మహేష్ మ్యానియాను విపరీతంగా పెంచడానికి నమ్రత అనుసరిస్తున్న వ్యూహాలలో ఇది భాగమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: