ఎవడుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు..నేనే ఐతే ఏంటి... ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. గుండు దిగిందా లేదా అన్నది ముఖ్యం.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు.. ఈ డైలాగ్స్ వింటే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమా పోకిరి.  డైలాగ్స్ తో పాటు సినిమా టేకింగ్, మేకింగ్ అదిరిపోతాయి.  సినిమా గలగల పారుతున్న గోదారిలా  పరుగులు తీస్తుంది.  2006లో వచ్చిన ఈ సినిమా మాములు హిట్ కాదు. బంపర్ హిట్.  ఇంకా చెప్పాలి అంటే మరో హిట్ కూడా చెప్పొచ్చు.  


పూరి.. మహేష్ కాంబినేషన్లో ఈ సినిమా తరువాత వచ్చిన మరో సినిమా బిజినెస్ మెన్.  ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఎలాగోలా బతకడానికి ముంబై రాలేదు.. ముంబై ను ఉచ్చపోయించడానికి వచ్చాను.. బిజినెస్ మెన్ సినిమాతో మరో హిట్ కొట్టారు.  ఇందులో పోకిరి సినిమా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషల్లో రీమేక్ చేశారు.  


అటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యింది.  భారీ హిట్ కొట్టింది.  సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించారు.  వాంటెడ్ పేరుతో సినిమాను రీమేక్ చేశారు.  అప్పటి వరకు సల్మాన్ ఖాన్ కొన్ని ప్లాప్ లను ఎదుర్కొన్నాడు.  కానీ, ఈ సినిమాతో సల్మాన్ తిరిగి హిట్ అందుకొని మాస్ లో స్తానం సంపాదించాడు.  కాగా, ఇప్పుడు వాంటెడ్ సినిమాకు సీక్వెల్ చేయాలని సల్మాన్ అనుకుంటున్నాడు.  


 పోకిరి సినిమాకు తెలుగులో సీక్వెల్ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  కానీ, అవి వార్తలకే పరిమితం అయ్యాయి.  అయితే, బాలీవుడ్లో ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారు. ప్రస్తుతం సల్మాన్ దబాంగ్ 3షూటింగ్ బిజీలో ఉన్నారు.  ప్రభుదేవా దర్శకుడు.  దీంతో పాటు త్వరలోనే సంజయ్ లీలా బన్సాలి ఇన్షాఅల్లా సినిమా తెరకెక్కబోతున్నది.  ఇదిలా ఉంటె, వాటెండ్ సీక్వెల్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరి నుంచి పట్టాలెక్కేబోతున్నట్టు తెలుస్తోంది.  వాంటెడ్ సీక్వెల్ కు కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహిస్తారట.    మహేష్ బాబు మాత్రం పోకిరి సీక్వెల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: