ఈమధ్య సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్ కు వచ్చి ప్రత్యేకంగా మహేష్ తో సమావేశం కావడం ఫిలింనగర్ లో సంచలన వార్తలకు కేంద్రంగా మారింది. అంతేకాదు మహేష్ ప్రశాంత్ నీల్ ల మధ్య వచ్చేఏడాది మూవీ ప్రాజెక్ట్ ఖాయం అంటూ వార్తల హడావిడి మొదలు అయింది. 

వాస్తవానికి మైత్రి మూవీస్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో లీకులు వచ్చాయి. దీనికితోడు ఈ సంచలన దర్శకుడు ఒక పవర్ ఫుల్ స్టోరీని ఇప్పటికే జూనియర్ కోసం తయారు చేసాడు అన్నవార్తలు కూడ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా మహేష్ ప్రశాంత్ నీల్ మధ్య దేనికి సంకేతం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు ఈడైరెక్టర్ జూనియర్ తో చేయాలి అనుకున్న మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

అయితే అసలు విషయం వేరు అంటున్నారు. ప్రశాంత్ నీల్ కు జూనియర్ తో సినిమాచేయాలని అభిప్రాయం ఉన్నా జూనియర్ వచ్చే ఏడాది సమ్మర్ తరువాత మాత్రమే తన డేట్స్ ను ఈడైరెక్టర్ కు ఇస్తాను అని చెప్పినట్లు టాక్. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ చేయబోయే సినిమా దర్శకుడు ఇంకా ఫైనల్ కాని పరిస్థితులలో ముందుగా మహేష్ ను లైన్ లో పెట్టుకుని ఆతరువాత జూనియర్ విషయం ఆలోచించాలి అని ఈడైరెక్టర్ ఆలోచన అని అంటున్నారు. 

అయితే ఇది అంతా కేవలం ఊహాగానాలు మాత్రమే అని ‘కేజిఎఫ్ 2’ షూటింగ్ ఇంకా పూర్తి కాని పరిస్థితులతో పాటు ఈమూవీ నిర్మాణం పై ఈమధ్య కోర్టు స్టే ఇచ్చిన నేపధ్యంలో తన తదుపరి సినిమా ప్రాజెక్ట్స్ కోసం అటు జూనియర్ ను ఇటు మహేష్ ను ఒకేసారి లైన్ లో పెడుతూ ఎవరో ఒకరిని తన కథకు ఓకె చేయించుకునే ప్రశాంత్ నీల్ ఆలోచనలలో ఇలా లీకులు వస్తున్నాయి అని అంటున్నారు. దీనికితోడు మహేష్ జూనియర్ లు కూడ ప్రశాంత్ నీల్ పై ఆసక్తిగా ఉండటంతో ఇలాంటి రివర్స్ డ్రామా కొనసాగుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: