ప్రస్తుతం ఛార్మీ టాలీవుడ్ ఏక్తా కపూర్ గా మారింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం పూరీ జగన్నాథ్ సహకారంతో ఆమె నిర్మాతగా రాణిస్తున్న తీరు. మొదట్లో అపజయాలు పలకరించినా ఛార్మీ తన మనో నిబ్బరం కోల్పోకుండా పూరీని తన బిజినెస్ పార్టనర్ గా కొనసాగిస్తూ ‘ఇస్మార్ట్ శంకర్’ ద్వారా ఆమె పొందిన లాభాలు ఇప్పడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

దీనికితోడు పూరీకి తనకు మధ్య కేవలం ఒక్క బిజినెస్ రిలేషన్ షిప్ తప్ప మరే విధమైన సాన్నిహిత్యం లేదు అంటూ ఆమె ఈమధ్య చేస్తున్న ట్విట్స్ సంకేతాలు ఇస్తున్నాయి. ఈ మధ్య పూరీ జగన్నాథ్ భార్య ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భంగా ఆమెను అభినందించడమే కాకుండా ఆమె పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తూ ట్విట్ చేసింది. 

ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ ను సెట్ చేయడంలో ఆమె చాల తెలివిగా వ్యవహరించింది అన్న వార్తలు కూడ వచ్చాయి. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఊహించని లాభాలు తెచ్చిపెట్టడంతో జోష్ లో ఉన్న పూరీ ఛార్మీలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న ఖరీదైన బహుమతులు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.  

ఛార్మీకి పూరీ జగన్నాథ్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారును గిఫ్ట్ గా ఇవ్వగా పూరీ జగన్నాథ్ కు ఛార్మీ రేంజ్ రోవర్ వోగ్ ను బహుమతిగా ఇచ్చింది. ఈ బహుమతులకు సంబంధించిన ఫోటోలను ఛార్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినా నిర్మాతగా ఛార్మీ చాల ముందు చూపుతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వీస్తోంది. త్వరలో ఛార్మీ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలు కూడ చేస్తూ ఇందులో కొత్తవారికి అవకాశాలు ఇవ్వబోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: