వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ గతవారం ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో పోటీగా విడుదల కావలసి ఉంది. అయితే నానీకి సహాయం చేయాలి అన్న ఉద్దేశ్యంతో వరుణ్ తేజ్ ఒక మెట్టు దిగి తన సినిమాను ఈ వారానికి వాయిదా వేసుకున్నాడు. అయితే ఈ మూవీతో హీరో సూర్య నటిస్తున్న ‘బందోబస్త్’ మూవీ విడుదల అవుతున్నా ఆమూవీతో పోటీని వరుణ్ తేజ్ చాల లైట్ గా తీసుకున్నాడు. 

దీనికి కారణం ప్రస్తుతం సూర్య సినిమాలకు ప్రేక్షకులలో ఏమాత్రం క్రేజ్ లేదు. అయితే అనూహ్యంగా ‘బందోబస్త్’ మూవీని దిల్ రాజ్ నైజాం ప్రాంతంలో విడుదల చేస్తూ ఉండటంతో కొన్ని మంచి ధియేటర్లు అన్నీ ‘బందోబస్త్’ కు వెళ్ళిపోయాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని దిల్ రాజ్ తన  సన్నిహితులతో అంటున్నట్లు సమాచారం. 

దీనికితోడు ‘వాల్మీకి’ టైటిల్ ను ‘గద్దల కొండ గణేష్’ గా ఆఖరి నిముషంలో మార్చడంతో విపరీతమైన కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. సాధారణంగా ఆఖరి క్షణంలో టైటిల్స్ మార్చిన సినిమాలు విజయవంతమైన సందర్భాలు గతంలో లేవు. దీనితో ‘వాల్మీకి’ ఫెయిల్ అవుతుందా అన్న భయం వరుణ్ తేజ్ హరీష్ శంకర్ లను వెంటాడుతున్నట్లు టాక్.

ఇలాంటి పరిస్థితులలో అనవసరంగా నానీకి సహాయం చేసి తాను ఇరుక్కుపోయానా అంటూ వరుణ్ తేజ్ మధన పడుతున్నట్లు టాక్. అంతేకాదు ‘గ్యాంగ్ లీడర్’ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాకపోవడంతో అదే సమయంలో వరుణ్ తేజ్ మూవీ పోటీగా విడుదల అయి ఉంటే కలక్షన్స్ బాగా వచ్చేవి అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మంచితనంతో నానీకి ఉపకారం చేసి వరుణ్ తేజ్ నష్టపోయాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘గద్దలకొండ గణేష్’ రిజల్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: