‘సాహో’ బిజినెస్ షేర్ లో ప్రభాస్ కు 70 కోట్ల షేర్ వచ్చింది అని వార్తలు హడావిడి చేసి కొన్ని రోజులు పూర్తి కాకుండానే ఇప్పుడు ‘సాహో’ వల్ల ప్రభాస్ కు 50 కోట్ల నష్టం వచ్చింది అంటూ ఒక సరికొత్త షాకింగ్ న్యూస్ హడావిడి మొదలైంది. ఈ గాసిప్ ను ప్రచారంలోకి తీసుకు వస్తున్న వ్యక్తులు చెపుతున్న లీకులను బట్టి ప్రభాస్ సుమారు 50 కోట్లకు పైగా కొంతమంది బడా ఫైనాన్సర్స్ కు ‘సాహో’ విషయంలో మాట హామీ ఇచ్చాడు అంటూ చెపుతున్నారు. 

‘సాహో’ బడ్జెట్ ఊహించన స్థాయికి మించి పోవడంతో ఈ మూవీని నిర్మించిన నిర్మాతలు ప్రభాస్ సన్నిహితులు కావంతో ఈ మూవీని పూర్తి చేయడానికి నిర్మాతలు కొంతమంది దగ్గర భారీ మొత్తాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ మొత్తాలను ‘సాహో’ నిర్మాతలకు ఇచ్చే ముందు ప్రభాస్ దృష్టికి తీసుకు వచ్చి అతడి మాట హామీని కూడ తీసుకున్నట్లు చెపుతున్నారు.

ఇప్పుడు ఆ మొత్తాలు వడ్డీలతో కలిపి 70 కోట్లకు దాటి పోవడంతో ఈ డబ్బును ఇచ్చినవారంతా ప్రభాస్ దృష్టికి తీసుకు రావడంతో ఈ విషయాన్ని సామరస్య పూర్వకంగా సెటిల్ అయ్యేలా చూస్తానని మాట ఇచ్చినట్లు గాసిప్పులు గుప్పు మమంటున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ న్యూస్ విని చాలామంది షాక్ అవుతున్నారు.  అయితే 500 కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగిన ‘సాహో’ నిర్మాతలకు ఆర్ధిక సమస్యలు ఏమిటీ అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. 

దీనితో ‘సాహో’ ఫలితం వల్ల ప్రభాస్ కు నిరాశ ఎదురు కావడమే కాకుండా ఈ అనవసరపు రొచ్చులో తన పేరు బయటకు రావడం ప్రభాస్ కు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ యూవీ క్రియేషన్స్ నిర్మించే భవిష్యత్ సినిమాలకు అండగా ఉంటాడా లేకుంటే ‘సాహో’ నేర్పిన గుణపాఠంతో దూరంగా ఉంటాడా అని అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: