గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ -మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ నటన , డైలాగ్స్ , హరీష్ మార్క్ డైరెక్షన్ హైలైట్ అయ్యాయి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా రూపొందిన ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్, సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు.
ఇక ఈచిత్రంతో ఈఏడాది వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నాడు. అందులో భాగంగా వరుణ్ ఈ సంక్రాంతి కి ఎఫ్2 తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా తాజాగా ఇప్పుడు గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ కొట్టాడు.