ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్కటీజర్, ట్రైలర్ , లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ చిత్రం విడుదలైయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ , నయనతార , తమన్నా ముఖ్య పాత్రల్లో నటించగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు.
సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీస్థాయిలో విడుదలకానుంది. ఇక ఓవర్సీస్ లో ఈచిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదలచేస్తుంది.