సాహో తరువాత భారీ బడ్జెట్ తో  భారీ అంచనాలతో  పాన్ ఇండియా  సినిమా గా విడుదలఅవుతున్న  తెలుగు సినిమా...  సైరా నరసింహ రెడ్డి.  మెగాస్టార్ చిరంజీవి  టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం   పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  అందులో భాగంగా నిన్న సెన్సార్  పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ ను పొందింది.  ఇక ఫిలిం నగర్  వర్గాలనుండి సమాచారం ప్రకారంసైరా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా చివరి  30నిమిషాలు ఎమోషన్స్ తో కూడుకున్న నర్సింహారెడ్డి జర్నీ చిత్రానికి  మెయిన్ హైలైట్  అయ్యిందని సమాచారం.


ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్కటీజర్,  ట్రైలర్ , లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  మరి ఈ చిత్రం విడుదలైయ్యాక  ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , నయనతార , తమన్నా  ముఖ్య పాత్రల్లో నటించగా  బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు.


సుమారు 270 కోట్ల  భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం   అక్టోబర్ 2న గాంధీ జయంతి  సందర్భంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీస్థాయిలో  విడుదలకానుంది. ఇక  ఓవర్సీస్ లో ఈచిత్రాన్ని  ఫార్స్ ఫిలిమ్స్  విడుదలచేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: