తెలుగు , తమిళ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు సూర్య.. ఎం చేసిన కూడా అది ఒక సెన్సేషనల్ అవుతుంది. అది సినిమా అయినా.. నిజ జీవితంలో అయినా సరే అయన గ్రేట్ అని అందరికి తెలుసు. సినిమాలలో ఎంత కోపంగా చేసిన , బయట మాత్రం చాలా సరదా మనిషి.. అని అందరు అంటున్నారు..



ఇకపోతే మొన్న నటించిన బందోబస్త్ సినిమా హిట్ అయింది. అంతేకాకుండా కోట్లను కూడా రాబట్టింది.  ఆ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే మా తో సినిమాకు కూడా సైన్ చేసాడు. సుధ కొంగర దర్శకత్వంలో సురారి పోట్రు సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా 2  డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 




ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు .ఆ సినిమా కథ సూర్యను బాగా ఆకట్టుకుంది. అందుకే సూర్య ఆ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చాడు. అదేంటంటే .. ఆ చిత్రానికి పనిచేసిన 150 మందికి  సూర్య 8  గ్రాములున్న బంగారు కాయిన్ ఇచ్చాడు. దానితో అందరు సూర్యది నిజంగానే బంగారు మనసు అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు..




ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా కూడా  తెలుగు తమిళ్ , హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్రయూనిట్. ఇలా సూర్యతో పాటుగా చాలా మంది ప్రముఖ హీరో అందరు అదే చేస్తున్నారు. మొన్న బందోబస్త్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రానున్న సూర్య సినిమా ఏ రేంజులో హిట్ అవుతుందో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: