రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్. వరుసగా ప్లాప్స్ రావడంతో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటీవల విడుదలయిన మన్మధుడు-2 కూడా నిరాశపరచడంతో రకుల్ చాలా ఫీల్ అయిపోతోంది. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్న ఈ భామకు నిరాశే ఎదురయింది.


రీసెంట్ గా లక్ష్మి మంచు హోస్ట్ గా కొత్త కార్యక్రమం మొదలయింది. ఇందులో లక్ష్మి మంచు అడిగిన ప్రశ్నలకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది రకుల్. మీకు స్టార్స్ లో ఎవరిమీదయినా క్రష్ ఉందా అన్న ప్రశ్నకు రకుల్ తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అలాగే బాలీవుడ్ లో రణవీర్ సింగ్ పేరు చెప్పింది.


'నా టైమ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు చూసిన ప్రతి అమ్మాయి పడిపోతోంది ' ఈ డైలాగ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో మహేష్ బాబు అంటాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ టైం కూడా అలాగే నడుస్తోంది. ఇప్పటికే ఈ రౌడీ గారి ని ఇష్టపడే హీరోయిన్  సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పుడు రకుల్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. 


ఇంతకుముందు జాహ్నవి కపూర్,  కియార అద్వానీ, నిధి అగర్వాల్ కూడా విజయ్ మీద ఉన్న తమ ఇష్టాన్ని వ్యక్తపరిచారు. ఏదేమయిన రౌడీ గారి సుడి మాములుగా లేదు. ఇక రకుల్ ప్రస్తుతం భారతీయుడు-2 లో సిదార్థ్ జోడి గా నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ సినిమాలో ఛాన్స్ కొట్టింది అంటే మంచి క్యారెక్టర్ దక్కినట్టుంది. ఈ సినిమాతో అయినా తన ఫేట్ మారి మళ్ళీ టాప్ హీరోస్ తో జోడి కడుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ లో కూడా రకుల్ ఒక సినిమా చేస్తోంది ప్రస్తుతం.


మరింత సమాచారం తెలుసుకోండి: