సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తో ఎంతోమంది  నటీమణులు లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు. కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా  మీటూ ఉద్యమం కి బాగా రెస్పాండ్ వచ్చింది. ఈ ఉద్యమం తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎందరో ప్రముఖ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ పై కూడా లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన సినిమా కూడా ఆగిపోయింది అనే వార్తలు చక్కర్లు కొట్టుడుతున్నాయి.

అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ఆ దర్శకుడు స్పందించాడు. ఆ మధ్య రణబీర్ కపూర్ దీపికా పదుకొణె  కలిసి నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.ఈ ఇద్దరి కోసం బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ కథ సిద్ధం చేశారు అంటూ ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. ఇంతలోనే లవ రంజన్ పై మీ టు ఆరోపణలు రావడంతో కొన్ని రోజులుగా ఈ సినిమా సంగతులు వినపడలేదు.

దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలయ్యుంది. కానీ ఈ వార్తలను లవ్ రంజన్ కొట్టిపారేసినట్టు సమాచారం. అజయ్ దేవగన్, రణబీర్, దీపికకు ఈ కథ నచ్చింది. మొదటి నుంచి ఈ చిత్రంలో నటించడానికి ఈ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. వారు  లవ్ రంజన్ ఫై వచ్చిన ఆరోపణలకు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారని తెలుస్తుంది. తన మీద వచ్చిన ఆరోపణలకు, తన సినిమా మీద అప్డేట్ రాకపోవడానికి సంబంధం లేదన్నారు.

మధ్యలో వచ్చినవన్నీ పుకార్లే అని లవ్ రంజన్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటివరకు  జోడి ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ పేరున్న  రణవీర్, దీపిక ఈ మూవీ లో కూడా జంటగా నటించబోతున్నారు  అనుకున్నారు.  కానీ అజయ్ దీపిక జంటగా నటించబోతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: