చాల రోజుల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్  పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  “ఎంత మంచివాడవురా” అనే టైటిల్ తో  రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల దర్శకుడిగా పేరు ఉన్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.ఇది ఎలా ఉండగా  తాజాగా సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త హల్ చల్ చేస్తోంది.

 గుజ‌రాతీ సినిమా ‘ఆక్సిజ‌న్’ మూవీ ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారట అని తెలిపారు.ఇక  కథ విషయానికి వస్తే.. నాట‌కం స్టేజ్‌ పైనే పుట్టిన స్టార్ హీరో.. ఆ తరువాత అతని లైఫ్ లో ఎదురైన  సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా నాట‌క రంగమే అని నమ్ముతాడట అని కథలో తెలుస్తుంది. ఆ తరువాత అంద‌రికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు అని తెలుపుతుంది కథాంశం. మరి ఈ కథ విషయంలో  ఎంత నిజం ఉందో  లేదో చూడాలి మరి.

కాగా ఈ సినిమా శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జతగా  మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’, అలాగే బన్నీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు కూడా రిలీజ్ భరిలో ఉన్నాయి.

ఈ సినిమాలకి పోటీగా “ఎంత మంచివాడవురా” సినిమా కూడా రిలీజ్ కి సిద్ధం అయంది అని తెలుస్తుంది.  మరి ఈ భరిలో ఎవ్వరు వియయం సాధిస్తారో  చూడాలి మరి.
ఇక కళ్యామ్ రామ్ కూడా చాల బాగా నటిస్తారు అని అందరికి తెలిసిందే.  ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కళ్యామ్ రామ్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: