చాల రోజుల తర్వాత నందమూరి
కళ్యాణ్ రామ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా “ఎంత మంచివాడవురా” అనే టైటిల్ తో రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల దర్శకుడిగా పేరు ఉన్న
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.ఇది ఎలా ఉండగా తాజాగా సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త హల్ చల్ చేస్తోంది.
గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ మూవీ ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారట అని తెలిపారు.ఇక కథ విషయానికి వస్తే.. నాటకం స్టేజ్ పైనే పుట్టిన స్టార్ హీరో.. ఆ తరువాత అతని లైఫ్ లో ఎదురైన సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా నాటక రంగమే అని నమ్ముతాడట అని కథలో తెలుస్తుంది. ఆ తరువాత అందరికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు అని తెలుపుతుంది కథాంశం. మరి ఈ కథ విషయంలో ఎంత నిజం ఉందో లేదో చూడాలి మరి.
కాగా ఈ సినిమా శివలెంక
కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ
సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో
కళ్యాణ్ రామ్ జతగా మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’, అలాగే బన్నీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు కూడా రిలీజ్ భరిలో ఉన్నాయి.
ఈ సినిమాలకి పోటీగా “ఎంత మంచివాడవురా” సినిమా కూడా రిలీజ్ కి సిద్ధం అయంది అని తెలుస్తుంది. మరి ఈ భరిలో ఎవ్వరు వియయం సాధిస్తారో చూడాలి మరి.
ఇక కళ్యామ్ రామ్ కూడా చాల బాగా నటిస్తారు అని అందరికి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కళ్యామ్ రామ్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.