మొదట కమెడియన్ గా తెలుగు సినిమా పరిశ్రమ లో కెరియర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ తన కంటూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టి 
గబ్బర్ సింగ్, టెంపర్ మొదలగు  పలు చిత్రాలను నిర్మించి అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్.

ఆ తర్వాత సినిమా నిర్మాణానికి కొంత కాలం దూరమైన బండ్ల గణేష్..ఈ మధ్య తాజాగా మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాతో  మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
తాజాగా ఈ  సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నారు . గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘బిజినెస్ మేన్’లో నటించారు  బండ్ల  గణేష్ .ఈ సినిమాలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్  కోరారు అని పుకార్లు వినిపిస్తున్నాయి .

ఇదిలా ఉంటె గణేష్ నిర్మించిన గోవిందుడు అందరివాడే చిత్రం నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 2014లో అక్టోబరు 1న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బండ్ల గణేష్.. రామ్‌చరణ్‌తో మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీయాలని ఉందని సోషల్ మీడియా ట్విట్టర్  ద్వారా వెల్లడించారు. 

మళ్లీ  మీ తో  ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ‘మరో ఛాన్స్ ఇవ్వండి  బాస్’.. అంటూ రామ్‌చరణ్‌ను ట్విటర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఆ అవకాశాన్ని త్వరగా ఇవ్వాలని కోరారు బండ్ల గణేష్. మరి రామ్ చరణ్ తన  కోరిక తీరుస్తాడో లేదో వేచి చూడాలి మరి.లిటిల్ బాస్ సరే అంటే  మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో మంచి బ్లాక్ బస్టర్ రాబోతుంది అని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: