సైరా నరసింహారెడ్డి మూడేళ్ళ కష్టం.. దాదాపు 10వేలమంది సినిమాకోసం పనిచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఆలస్యం అని చెప్తూ వచ్చారు. చివరికి వచ్చేసరికి సినిమాను రాజమౌళికి ఒకసారి చూపించాలని, ఆ తరువాత సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. రాజమౌళికి సినిమా చూపించారో లేదో తెలియదు. సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ తరువాత మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఫస్ట్ డే రోజున కలెక్షన్లు పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. అయితే, రెండో రోజు నుంచి సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అన్నది తెలియాలి. ఇక సినిమాను అనేక మంది సెలెబ్రిటీలు పొగుడుతూ ట్వీట్ చేస్తున్నారు. మెగాస్టార్ ఒత్తిడి మేరకే ట్వీట్ చేస్తున్నారని చాలామంది విమర్శిస్తున్నారు. సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు ఇలా ట్వీట్ చేయిస్తున్నారని మరో టాక్ కూడా వచ్చింది. అలాంటిది ఏమి లేదని, సినిమా బాగుంది కాబట్టే సినిమా గురించి చెప్తున్నట్టు సెలెబ్రిటీలు చెప్తున్నారు.
ఇక సైరాను పొగుడుతూ ట్వీట్ చేసిన వాళ్లలో మహేష్ బాబు కూడా ఉన్నారు. మహేష్ బాబుకు సినిమా బాగా నచ్చిందట. మెగాస్టార్ నటన చాలా చాలా బాగుందని, మెగాస్టార్ అనే పేరుకు తగిన విధంగా నటించారని అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యిందని అన్నారు. రత్నవేలును ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రత్నవేలుకు ప్రత్యేకంగా తెలియజేయడానికి ఓ కారణం ఉంది. రత్నవేలు ప్రస్తతం మెగాస్టార్ తో కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. రత్నవేలు తన కెమెరాతో మరోమారు
మాయ చేయబోతున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా రత్నవేలును పొగిడి ఉంటారు. మహేష్ బాబు ట్వీట్ చేయడంతో సినిమాకు కొంత ప్లస్ అవుతుంది. సినిమాను మహేష్ బాబు కూడా మెచ్చుకున్నారు అంటే... సినిమా ఎలా ఉంటోందో అని థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే వ్యక్తులు ఉంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సినిమా చూస్తారు. సైరాకు ఇది కూడా ఒక ప్రమోషనే కదా.