నటిగా ఆరంభ దశలోనే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకున్న నటి ఐశ్వర్యరాజేశ్‌. తమిళ్ తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న భామ ఐశ్వర్య రాజేష్‌. కోలీవుడ్ మూవీ కాక్కముట్టైతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య, ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తోంది. తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళ, హిందీ ఇండస్ట్రీలలోనూ అడుగు పెట్టి బహు భాషానటిగా కూడా పేరు తెచ్చుకుంది.

తాజాగా  శివకార్తికేయన్‌ హీరోగా నటించిన నమ్మ వీట్టు పిళ్లై చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించి అందరిని మెప్పించింది. నటుడు కమలహాసన్‌తో ఇండియన్‌–2 వంటి భారీ క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా వదులుకుందీ ఈ భామ. ఆ విషయం తనను చాలా రోజులగా బాధ కలిసాగిస్తుంది అని తెలిపింది ఐశ్వర్యరాజేశ్‌.ఆమె  మాట్లాడుతూ అవును తనకు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం వచ్చిన విషయం నిజమే కానీ ఈ చిత్రం కోసం గత డిసెంబర్‌లో కాల్‌షీట్స్‌ అడిగారని చెప్పింది.

అయితే ఆ చిత్రం షూటింగ్‌ ఆర్థిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల వాయిదా పడి ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలో ప్రారంభమైందని తెలిపింది. కానీ నాకు ఆ సమయంలో నాకి వేరే సినిమా ఛాన్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను అని తెలిపింది.ఇది తనకు చాలా బాధను కలిగించిన విషయం ఇదేనని తెలిపింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియాతో షేర్‌ చేసుకున్న ఐశ్వర్య, అంత భారీ చిత్రాన్ని వదులుకోవాల్సి రావటం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పింది.

పెద్ద సినిమా, కమలహాసన్‌ వంటి నటుడు, శంకర్‌ వంటి దర్శకుడు కాంబినేషన్‌లో నటించే అవకాశాన్ని వదులుకోవడంతో రెండు రోజులు నిద్ర పోవడానికి కష్టంగా ఉంది అని చెప్పింది. ఆ బాధ నుంచి బయట పడడానికి చాలా రోజులు పట్టిందని నటి ఐశ్యర్యరాజేశ్‌ పేర్కొంది. ప్రస్తుతంఐశ్యర్యరాజేశ్‌  దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వానం కొట్టటం, కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం, కా.పే.రణసింగమ్‌ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తోంది. ఇక ధనుష్‌కు జంటగా వడచెన్నై–2 చిత్రంలోనూ నటించడానికి కమిట్‌ మెంట్  ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: