ఒకటి టాలీవుడ్,
మరొకటి బాలీవుడ్ ఇంకొకటి
హాలీవుడ్...ఏమనుకున్నారు నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ ఐన భారీ చిత్రాలు. గాంధీ
జయంతి సందర్భంగా వైన్ అమ్మకాలు లేకపోయినా.....టికెట్ అమ్మకాలు మాత్రం హౌస్ ఫుల్ అయ్యాయి. తెలుగులో వచ్చిన మెగా స్టార్ చిత్రం సైరా నరసింహారెడ్డి.. బాలీవుడ్ హీరో హృతిక్ చిత్రం వార్.. హాలీవుడ్ చిత్రం జోకర్.. ఒక్కో భాష నుంచి ఒక్కో చిత్రంలతో అన్ని థియేటర్లు కళ కళలడాయి. ఈ మూడు చిత్రాలు కూడా ఎంతో క్రేజున్నవి కావడంతో ఈ మూడింటిపైనా పాజిటివ్ టాక్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ముందు నుండి ఇండియాలో తెలుగు ప్రేక్షకులకు సైరా.. బాలీవుడ్ ప్రేక్షకులకు వార్ చిత్రాలపై ముందే భారీ అంచనాలున్నాయి. తొలి రోజు రికార్డులు సహా తొలి వీకెండ్ వసూళ్లపైనా ట్రేడ్ పండితులు భారీ అంచనా వేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం.. ఈ మూడు సినిమాలు కలిపి దేశవ్యాప్తంగా 150-200కోట్ల మేర గ్రాస్ వసూలు చేసి ఉంటాయని అంచనా వేస్తోంది ట్రేడ్. కేవలం తెలుగు సినిమా సైరా తొలి రోజు వసూళ్లు అన్ని భాషలు కలుపుకుని సుమారు 50కోట్లు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.
ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయినప్పటికీ అడ్వాన్సు బుకింగ్ ల రూపంలోనే భారీగా వసూలు చేశాయి. పైగా పాజిటివ్ టాక్ ఉండడంతో వసూళ్ల పరంగా తగ్గవని ప్రముఖ సినీ క్రిటిక్ రమేష్ విశ్లేషించారు.నిన్న గాంధీ
జయంతి సెలవు దినం ఈ సినిమాలకు దేశీయంగా మంచి వసూళ్లకు ప్లస్ అవుతుందని క్రిటిక్ రమేష్
బాలా అంచనా వెలువరించారు. ఇక హృతిక్ - టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 30కోట్లు వసూలు చేసిందంటే కలెక్షన్ జోరు ఏ విధంగా ఉందొ అంచనా వెయ్యొచ్చు. ఈ చిత్రం ఓపెనింగ్ డే 70శాతం బుకింగ్స్ జరిగితే.... ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తెలిస్తే ఆ లెక్క కూడా మారిపోతుందని విశ్లేషిస్తున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి-అమితాబ్ సహా అన్ని భాషల స్టార్లు నటించడం వల్ల సైరాకి డే వన్ వసూళ్లు భారీగా దక్కి ఉంటాయని రమేష్
బాలా తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తగా హాలీవుడ్ చిత్రం జోకర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. సమీక్షలు, అభిప్రాయాలు అన్ని కూడా నిన్న పాజిటివ్ గా వచ్చాయి. అందువల్ల భారీగానే వసూలు చేసి ఉంటుందని అంచనాను వెల్లడించారు. మౌత్ టాక్ తో జోకర్ కూడా వసూళ్లను పెంచుకుంటుందని విశ్లేషిస్తున్నారు.