ఇక ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా వున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తమిళ డైరెక్టర్ తిరు తెరకెక్కించిన ఈ చిత్రం లో మెహ్రీన్ కథానాయికగా నటించగా బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. సుమారు 40కోట్ల బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈచిత్రానికి పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. 147నిమిషాల నిడివి తో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక లౌక్యం తరువాత ఏకంగా వరుసగా 5 పరాజయాలను చవిచూసిన గోపిచంద్ కు చాణక్య విజయం కీలకం కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపిచంద్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం తెరకెక్కిస్తున్న చిత్రం కాగా రెండవది సంపత్ నంది డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో గోపిచంద్ మహిళల కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపించనున్నాడు.