కమెడియన్
పృథ్వీ శ్రీవెంకటేశ్వరా ఛానల్ చైర్మన్ గా అయిన తరువాత అతడి లుక్ లో బాడీ లాంగ్వేజ్ లో చాల మార్పులు వచ్చాయి. నుదుటి పై నామాలు పెట్టుకుని కనిపిస్తున్న
పృథ్వీ తన మాట తీరులో మరింత వేగం పెంచి ఎలాంటి వారిని అయినా టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో
పృథ్వీ గాయని సునీతను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వాహనాల గురించి తాను ఎస్ వి ఛానల్ తరపున ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలని ప్రయత్నించి ఇండస్ట్రీలోని కొంతమందిని అడిగితే రోజుకు రెండు లక్షలు ఇమ్మని అడిగిన విషయాన్ని బయటపెట్టాడు.
ఇదే సందర్భంలో
పృథ్వీ మరొక ట్విస్ట్ ఇస్తూ తమ ఎస్ వి ఛానల్ కు కీరవాణి సునీత లాంటి వాళ్ళు అవసరం లేదు వారి స్థాయితో సమానమైన వాళ్ళు స్థానికంగా తిరుపతిలోనే అద్భుతమైన గాయకులు సంగీత దర్శకులు ఉన్నారు అంటూ
పృథ్వీ చేసిన కామెంట్స్ తో
పృథ్వీ సునీత కీరవాణిల మధ్య ఏమైంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఇదే సందర్భంలో
పృథ్వీ మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ఎస్ వి ఛానల్ కోసం నెలకు 20 రోజులు తిరుపతిలోనే ఉండి పనిచేస్తూ తనకు వచ్చే లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకున్నాను అంటూ మరొక షాకింగ్ కామెంట్ చేసాడు.
చిన్న జీయర్ స్వామి సూచనతో రామానుజాచార్యుల పై ఒక కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రసారం చేయబోతున్న విషయాలను వివరిస్తూ తెలుగులో ప్రసారం అవుతున్న అనేక భక్తి ఛానల్స్ కు ధీటుగా తన ఎస్ వి ఛానల్ ఉంటుంది అని సంకేతాలు ఇస్తున్నాడు. ఇదే ఇంటర్వ్యూలో మరొక ప్రశ్నకు స్పందిస్తూ గతంలో ఎస్ వి ఛానల్ కు చైర్మన్ గా పనిచేసిన రాఘవేంద్రరావుకు గడ్డం ఉంటే తనకు గడ్డం లేదు అంటూ తాను ఏ విషయంలోనూ ఎవరికీ తీసిపోను అంటూ
పృథ్వీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి..