మహానటుడు ఎస్వీ రంగారావు నటనే నాకు ప్రేరణగా నిలిచిందని మెగాస్టార్
చిరంజీవి అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు సెంటర్లో మహానటుడు ఎస్వీరంగారావు అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్
చిరంజీవి ఆవిష్కరించడం జరిగింది. ఎస్వీఆర్ మెగా అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ ఎస్వీఆర్ గారి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించే నాకు ఎంతగానో ఆనందంగా ఉంది అని తన
భావన తెలిపారు. ఈ విగ్రహాన్ని గత ఏడాదే ఆవిష్కరించాల్సి ఉండగా
సైరా చిత్రం షూటింగ్ వలన వాయిదా పడిందని తెలిపారు సమావేశంలో. ఆనాటికి ఈనాటి ఏనాటికైనా ఎప్పటి కైనా ఎస్వీఆర్ మహానటుడిగానే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారని చిరు తెలిపారు.
నేను ఎస్వీఆర్ గారి నటనను చూసి నటుడిని కావాలని మద్రాస్ కూడా వెళ్లడం జరిగింది అని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఆ మహానుభావుడి నటనతోనే నేను ప్రేరణ పొందానని ఆ ప్రేరణే నన్ను సినిమాల వైపుకు వెళ్లే విదంగా చేసింది అని తెలిపారు. ఈ రోజు ఇలా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం దక్కిందంటే ఆ మహానటుడి చలువేనని మెగాస్టార్ భావోద్వేగంతో ఎస్వీఆర్ ని గుర్తు చేసుకున్నారు.
ఎస్వీఆర్ విగ్రహా ఆవిష్కరణకు ప్రభుత్వ అనుమతులు తీసుకునేందుకు సహాకరించిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు చిరంజీవి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం,అదృష్టం నాకు కలిగించిన జిల్లా ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. నా
సైరా చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్వీఆర్ ఆశీస్సులు ఎల్లప్పుడు నాకు ఉంటాయని మెగాస్టార్ ప్రకటించారు.
తర్వాత నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఏడాదికాలంగా ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మెగాస్టార్ కోసం ఎదురు చూస్తున్నాం..కానీ ఆ కోరిక ఇప్పటికి నెరవేరింది.. చలన చిత్ర చరిత్రలో ఎస్వీఆర్ లాగా మెగాస్టార్
చిరంజీవి జీవితం కూడా చరిత్రలో నిలిచిపోవాలని అని తెలిపారు.