మాములుగా సెలెబ్రెటీలు అంటే నెటిజన్లు ఏదొక విషయంపై ట్రోల్స్ వేస్తున్నారు. ఒక్కసారి వాళ్లకు చిక్కితే మల్లి ఆ మచ్చ అనేది పోదు. ప్రస్తుతం ఆ విషయానికొస్తే బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమి ఆ సమస్యతో పోరాడుతుంది. యాంకర్ గా ఎంత ఫెమస్ అయిందో అంతకు మించిన విదంగా వార్తల్లో నిలుస్తుంది. 


వివరాల్లోకి వెళితే.. ఈ రోజు దసరా సందర్బంగా దసరా పండుగ ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రామే సుధీర్ ఇంట్లో దెయ్యం ఉంది. ఈ కార్యక్రమానికి మరి కొందరు జబర్దస్త్ ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. ఈ షోలో ప్రత్యకంగా కామెడీతో నవ్వించాలని ఒక కోతిని కట్టి తీసుకొచ్చారు. మూగ జీవులను హింసిస్తున్నారు అనే మాటలను మూటకట్టుకున్నారు. 



ఆ షో లో మూగ జీవులను హింసించే విదంగా చేస్తే రష్మీ ఒంటికాలిపై లేస్తుందనే విషయం తెలిసిందే. ఎందుకంటే రష్మీ మూగజీవాలను హింసించే విదంగా చేస్తే ఊరుకోదని అందరికి తెలిసిన విషయమే. అయితే షోలో కోతి పిల్లను తీసుకురావడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘రష్మీ.. వీధి కుక్కలపై, ఇతర మూగ జీవాలపై నువ్వు చూపుతున్న కేర్ చూసి నాకెంతో సంతోషం వేసింది. కానీ ‘సుధీర్ ఇంట్లో దెయ్యం’ అనే షోలో కోతి పిల్లను కట్టేసి తీసుకొచ్చారు. మరి ఈ విష్యం పై నువ్వు మాట కూడా అనలేదు.



ఈ విషయం పై స్పందించిన రష్మీ మాటలతో మండిపడింది. మీరు ఈ విషయాన్నీ గుర్తుంచినందుకు కృతజ్ఞతలు అని రష్మీ అంది. కోతిని తీసుకొచ్చి చేసిన ఎపిసోడ్లో నేను లేను నేను కనుక ఉంటె ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకోచేదాన్ని కాదు. ఒక సారి ఆ ఎపిసోడ్ లో చుడండి అంటూ ఆమె హితవు పలికింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: