మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఇండస్ట్రీ నుంచి ఎందరో ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం గురించే చర్చించుకుంటున్నారు. తెలుగు, కన్నడం, యూఎస్ ల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసి చిరంజీవి సమకాలీకులు తనను అభినందించిన తీరును మెగాస్టార్ రివీల్ చేశారు.

 


నాగ్ హత్తుకుని.. ‘ఇంతకంటే ఏం చెప్పలేను’ అన్నాడని, వెంకటేశ్ తన ఇంటికొచ్చి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడని చిరంజీవి ఇటివల త్రివిక్రమ్ తో జరిగిన మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ సినిమా చూసి ఫోన్ చేశారని, ఆయన శ్రీమతి లత కూడా ఫోన్ లో మాట్లాడి అభినందించారని చెప్పుకొచ్చారు. చిరంజీవి నటనను మహేశ్ బాబు, నాని, బాలయ్య అల్లుడు లోకేశ్ తో సహా ఎంతోమంది దర్శకులు మెచ్చుకున్నారు. అయితే ఇక్కడ అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న ఒకటే. ఇంతమంది అభిమానిస్తుంటే మరి బాలకృష్ణ ఏమయ్యాడు అని. తనకు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది స్నేహితుల్లో చిరంజీవి ఉన్నారు.. అని ఆమధ్య బాలయ్య చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాపై ఆయన ఎందుకు స్పందించలేదోనని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా.

 


అయితే ఇక్కడ ఎవరికివారు తమ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. అయితే బాలకృష్ణ తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని డిసెంబర్ లో సినిమా రిలీజ్ కోసం డే అండ్ నైట్ షూటింగ్ తో బిజీగా ఉన్నారని అంటున్నారు. నిజానికి బాలకృష్ణ సినిమాలు చూసేది తక్కువ. ఇతర నటుల గురించి బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడరు. మరి త్వరలో అయినా సైరా విషయంలో స్పందిస్తారేమో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: