ఇండియన సూపర్ స్టార్  రజినీకాంత్ 68ఏళ్ల వయసులో కూడా  వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు  గట్టి పోటీనిస్తున్నాడు.  అందులో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో  పేట తో  ప్రేక్షకుల ముందుకు వచ్చి రజినీ  సూపర్ హిట్ కొట్టాడు.   ఈ చిత్రం తరువాత పెద్దగా గ్యాప్  తీసుకోకుండా దర్బార్ లో నటించాడని ఓకే చెప్పాడు.  ఇటీవలే  ఈ చిత్రం  యొక్క షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.   కేవలం 100రోజుల్లోనే  రజినీ ఈ  చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం.  స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  లేడీ సూపర్ స్టార్  నయనతార  హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్  నివేతా థామస్  ముఖ్య పాత్రలో కనిపించనుంది.  యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న  ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో పొంగల్ కానుకగా  జనవరి 11న విడుదలకానుందని సమాచారం.



ఇక ఈసినిమా ను పూర్తి చేశాడో లేదో అప్పుడే  రజినీ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు.  శౌర్యం , శంఖం , దరువు చిత్రాలతో   తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ ఆ తరువాత  కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ తో వరుసగా  సినిమాలు చేసి అక్కడ ఫేమస్ అయ్యాడు.  వివేగం తరువాత  అజిత్ తో  చేసిన విశ్వాసం సూపర్ హిట్ కావడంతో   శివకు కోలీవుడ్ లో డిమాండ్ పెరిగింది.  ఇక ఇటీవల  రజినీ ని కలిసి  శివ కథ వినిపించాడట. రజినీ కి ఆ కథ నచ్చడంతో వెంటనే సినిమా కు ఓకే చెప్పాడట.  డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.  పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్  నిర్మించనుంది.  ఇంతకుముందు  సన్ పిక్చర్స్ -రజినీ కాంబినేషన్ లో  రోబో , పేట చిత్రాలు తెరకెక్కగా ఈ రెండు సూపర్ హిట్లు అయ్యాయి. మరి ఈమూడో చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: