మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ కు భారదేశమంతటా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. బాలీవుడ్ లో ఐతే ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో అక్కడి స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి 2 తరువాత ప్రభాస్ సూజీత్ దర్శకత్వంలో నటించిన సాహో సినిమా ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. 
 
సాహో సినిమాకు అన్ని భాషల్లోను నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా భారీ స్థాయిలోనే ఉన్నప్పటికీ కథ, కథనంలోని లోపాలు సినిమాకు మైనస్ గా మారాయి. సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమాకు 220 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. బాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. 
 
దాదాపు 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత దర్శకుల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి బాహుబలి 2 సినిమాల తరువాత ప్రభాస్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 
 
స్టార్ డైరెక్టర్లు ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు తగినట్లు సినిమాలు తీయగలరని ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకులతో రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తోంది. మరి ప్రభాస్ జాన్ సినిమా తరువాతనుండైనా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తాడో లేదో చూడాలి. జాన్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అంతా యూరప్ లో జరుపుకుంటుందని తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: