సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతి రేస్ కు రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు'   మూవీలో  మొట్టమొదటిసారి మహేష్ తో నటిస్తున్న రష్మిక చేసిన ఒక పొరపాటు మహేష్ అభిమానులకు తీవ్ర అసహనం కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఈమధ్య దసరాకు విడుదలచేసిన 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్ పై రష్మిక చేసిన కామెంట్స్. 

దసరా సందర్భంగా అభిమానులకు కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ పోస్టర్ లో కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ ఇంటెన్స్ లుక్ ఇస్తూ నిలబడ్డాడు. ఈపోస్టర్ ను అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ "సూపర్ స్టార్ మహేష్ గారితో ఆయుధపూజ" అని మొదలుపెట్టి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోందని తెలియచేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేసాడు. 

అంతేకాదు తన ట్విట్ ను మహేష్ రష్మిక విజయశాంతి దేవీశ్రీప్రసాద్ రత్నవేలు అనిల్ సుంకర లకు ట్యాగ్ చేశారు. అయితే  ఈ ట్వీట్ ను చూసిన రష్మిక  రీట్వీట్  చేస్తూ "హ్యపీ దసరా" అంటూ మెసేజ్ పెట్టి రెండు ఎమోజిలను మాత్రం పెట్టింది. ఇప్పడు ఈ విషయం మహేష్ అభిమానులకు తీవ్రకోపాన్ని తెప్పించింది.   ఈనేపధ్యంలో విపరీతమైన అసహనానికి లోనైన మహేష్ వీరాభిమాని  ‘కనీసం సినిమా పేరును కూడా ట్యాగ్ చేయడం తెలియదా? మహేష్ బాబు ట్విట్టర్ ఐడీ టాగ్ ఎక్కడ?’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ‘పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ట్వీట్ చేయకుండా ఎందుకు లేట్ చేశావు? అప్పుడే ఇంత నిర్లక్ష్యం వచ్చేసిందా’ అంటూ ఆ వీరాభిమాని రష్మిక పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇది చాలదు అన్నట్లుగా మరో మహేష్ వీరభిమాని అయితే "ఇప్పుడే లేచావా నువ్వు.. మా ఖర్మ నువ్వు హీరోయిన్" అంటూ ఆగ్రహం వ్యక్త పరిచాడు.

వాస్తవానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మహేష్ సినిమా విషయంలో ఇలా ఎందుకు చేసిందో అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఇప్పటికే మహేష్ పక్కన రష్మిక లవ్ కెమిస్ట్రీ బాగుండదు అంటూ భయపడుతున్న  మహేష్ అభిమానుల అసహనాన్ని రష్మిక ప్రవర్తన మరింత రెచ్చకొడుతోంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: