అప్పుడు ప్రపంచాన్నే మరిచిపోతానంటోంది హీరోయిన్ సాయి పల్లవి. ఇంతకీ ఈ అమ్మడు చెప్పొచ్చేదేమిటీ అనేది చూసేస్తే పోలా నటిగా మాతృభాషలో గెలిచింది ఈ హైబ్రిడ్ పిల్ల. తెలుగు చిత్రసీమలోనూ విజయాలను సొంతం చేసుకుంది ఈ భామ. ఎటొచ్చీ తమిళ సినిమాలోనే సక్సెస్‌కు దూరం అయిపోయిందీ ఈ హీరోయిన్ కి. ఆ మధ్య సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం చాలా ఆశలు పెట్టుకున్నా, అది తీవ్ర నిరాశనే మిగిల్చింది అని చెప్పుకోవచ్చు. కానీ దానికి ముందు ధనుష్‌తో జతకట్టిన మారి–2 చిత్రమే కాస్త బెటర్‌ అనిపించింది. 


ఇందులో ఒక పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డు స్థాయిలో నిలవడంతో ఈ భామ కాస్త పాపులారిటీ సంపాదించింది. ఇది ఇలా ఉంటే  తమిళంలో సాయిపల్లవికి ప్రస్తుతం ఒక్క అవకాశం కూడా లేదు. ఇక్కడ అవకాశాలు, విజయాలు అందకపోవడానికి తనకున్న పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ ఒక కారణం కావచ్చు అని ఆనుతున్నారు సినీ ఇండస్ట్రీ. అయితే తెలుగులో అలాంటి ఇమేజ్‌తోనే అవకాశాలను రాబట్టుకుంటున్న సాయిపల్లవి అక్కడ మాత్రం రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. అయితే మాతృభాషలో మంచి పేరే ఉంది ఈ భామికి.


అయితే ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్య్వూలో పేర్కొంటూ తన నటన చాలా సహజంగా ఉంటుందని పలువురు ప్రశంచిస్తున్నారని అని అంటుంది. ఇందుకు కారణం తాను నటనలో పరిణితి చెందడమేనని అని పేర్కొంది. ఒక కథను తన చేతికిచ్చి అందులో నువ్వు నటించనున్నావని చెప్పారంటే చాలని, ఆ కథను పూర్తిగా చదివేస్తానని చెప్పింది ఈ భామ.


అప్పుడే అందులోని కథా పాత్రగా మారిపోతానని అంది. ఇక కెమెరా ముందుకు వచ్చానంటే తననే కాదు, ఈ ప్రపంచాన్నే మొత్తం మరిచిపోతానని చెప్పింది. తాను నటించే కథా పాత్రనే జ్ఞాపకం ఉంటాను అని తెలిపింది. అలా పాత్రగా మారిపోతానని అంది ఈ భామ. అయితే తన నటనను ఎవరు అభినందించినా, దానికి కారణం తానేనని ఫలాన్ని అంతా పొందనని అంది సాయి పల్లవి.



మరింత సమాచారం తెలుసుకోండి: