బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీదు. ఎవరి మైండ్‌లో ఏముంటుందో పక్కవారికి తెలిసే చాన్సే ఉండదు. అప్పటి పరిస్థితికి తగ్గట్టుగా ప్రత్యర్ధులు ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. అది వారి దృష్టిలో నిజమని భావించవచ్చు కానీ.. చివరకు ఏది కరెక్ట్ అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.

అదే విధంగా మొన్నటి ట్రాలీ టాస్క్‌లో బాబా భాస్కర్ కావాలనే టార్గెట్ చేశాడని రాహుల్, వరుణ్, వితికా అనగా.. అలాంటిదేమీ లేదని బాబా చెప్పుకొచ్చాడు. అయితే చూసే జనాలకు మాత్రం అది నిజమేనని అనిపించినా.. బాబా మనసులోఉన్నది ఎవరికీ తెలీదు కదా. అదే విషయాన్ని మహేష్ కూడా మిగతా వారితో చెప్పాడు. అది నిజమో కాదో ఆయనకే తెలియాలి.. అయినా అది ఆయన గేమ్ కావచ్చు అంటూ డిస్కషన్ పెట్టాడు.

అయితే టాస్క్ జరిగే సమయంలో శ్రీముఖి సైగ చేయడం, అంతకు ముందే వీరంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, శ్రీముఖి, శివజ్యోతి, బాబా, అలీ ఒకవైపు నిల్చొవడం అనుమానాలకు దారితీస్తోంది.  మధ్యలో డిస్కషన్ పెట్టుకుంటూ.. అంతగా డౌట్ ఉంటే మాష్టర్ ఇటు వస్తాడు.. నువ్వు అటు వెళ్లు అని మహేష్ అన్నాడు. కానీ దానికి మాత్రం బాబా ఆన్సర్ ఇవ్వలేదు. దాంతో ప్రేక్షకులకు అనుమానాలు వచ్చాయి.

నేను అలా నడపలేదు.. అవే అలా వెళ్లాయి.. చక్రాలను మనం కంట్రోల్ చేయలేం.. నా టార్గెట్ మొత్తం దానిపై ఉందంటూ బాబా భాస్కర్ ఏవేవో చెప్పుకొచ్చాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో బాబాను ఇదే విషయంపై నాగ్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆ టాస్క్‌ను గుర్తుచేస్తూ.. దానిపై క్లారిటీ ఇవ్వమన్నట్లు కనిపిస్తోంది. దీంతో బాబా కంటతడి పెట్టాడు. తాను కేవలం టాస్క్ ఆడటానికే వచ్చాను.. స్ట్రాటజీలు తెలియవని.. టైటిల్ కూడా గెలవాలని లేదంటూ చెప్పుకొచ్చాడు. చివరకు ఏమైందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: