సినిమా రంగంలో కొందరు ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తారు. వివాదాలు కొని తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఛోటా కే నాయుడు ఒకరు. ఆయన తాజాగా డైరెక్టర్ల మీద చేసిన కామెంట్లు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తన గురించి ఆయన చెప్పుకుంటూ డైరెక్టర్లను తక్కువ చేసి మాట్లాడారన్నది ఆ టాక్.. ఇంతకీ అసలు ఛోటా కే నాయుడు ఏమన్నారంటే..


"ఏ డైరెక్టర్ అయినా స‌రే కొత్తగా వ‌చ్చిన‌ప్పుడు క‌సిగా వ‌స్తారు కాబ‌ట్టి ఫ‌స్ట్ మూవీ చింపేస్తారు. సూప‌ర్ డూప‌ర్ హిట్ చేస్తారు. ఆత‌ర్వాత మ‌ళ్ళీ రెండు మూడు చిత్రాలు ఫ్లాప్ అవుతాయి. 90 ప‌ర్సెంట్ డైరెక్టర్లు అలాగే ఉంటారు. ఎవ‌రైతే వ‌రుస‌గా మూడు చిత్రాలు హ్యాట్రిక్ కొడ‌తారో నా దృస్టిలో వాళ్ళే అస‌లైన డైరెక్టర్లు... అన్నారు. అంతవరకూ అని ఊరుకుంటే బాగానే ఉండేది.. కానీ అలా ఊరుకుంటే ఆయన ఛోటా ఎందుకు అవుతారు..?


అలా హ్యాట్రిక్ కొట్టలేని డైరక్టర్లంతా వేస్ట్‌ కింద వ‌స్తారు అన్నారు ఛోటా. ఇప్పుడు ఈ లాస్ట్ కామెంటే చాలా మంది డైరెక్టర్లకు ఎక్కడో కాలిపోయేలా చేస్తోంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన డైరెక్టర్లు చాలా తక్కువ. చాలామంది సక్సస్ ఫుల్ డైరెక్టర్లు కూడా ద్వితీయ విఘ్నం ఫేస్ చేశారు. అంటే రెండో సినిమా ఫట్ అనిపించారు. మొదటి మూడు సినిమాలు హిట్ ఇచ్చిన డైరెక్టర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.


ఇంకా ఛోటా కే నాయుడు ఏమన్నారంటే.. " నేను చాలా మంది ద‌ర్శకుల‌తో ప‌ని చేశాన‌ని... నేను కాస్త యార‌గంట్‌గా ఉంటాన‌ని.. అందుకే ద‌ర్శకులు నాతో ప‌ని చెయ్య‌డానికి భ‌య‌ప‌డ‌తార‌ు.. అలాగే నాకు కొన్ని కండీష‌న్స్ ఉంటాయి. నాకు న‌చ్చక‌పోతే నేను ఎవ‌రు చెప్పినా విన‌న‌ని చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. అదే విధంగా న‌న్ను భ‌రించ‌డం కూడా చాలా క‌ష్టం.. అంటున్నారు ఛోటా.


మరింత సమాచారం తెలుసుకోండి: