ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదలచేస్తుండండం విశేషం. ఇంతకుముందు ఈ సంస్థ సాహో , సైరావంటి పెద్ద సినిమాలను అక్కడ విడుదలచేసింది. మరి ఇప్పుడు ఈ మీడియం బడ్జెట్ సినిమా ను విడుదలచేస్తుందంటే సినిమా లో విషయం వుండే ఉంటుంది. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి చోటా కె నాయుడు , గౌతమ్ రాజు , సాయి మాధవ్ బుర్ర వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. సూపర్ హిట్ మూవీ రాజుగారి గది సిరీస్ నుండి వస్తున్న మూడో చిత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.
ఇక రాజుగారిగదితో ఓంకార్ డైరెక్టర్ గా కూడా నిరూపించుకున్నాడు. ఆ సినిమా తరువాత ఓంకార్ ఏకంగా నాగార్జున , సమంత వంటి స్టార్ లతో రాజుగారి గది 2 ను తెరకెక్కించాడు. అయితే గత ఏడాది విడుదలైన ఈ చిత్రం యావరేజ్ ఫలితాన్ని రాబట్టింది. మరి ఇప్పుడు ఈరాజుగారి గది 3, ఓంకార్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక సోలో రిలీజ్ కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది.