నక్షత్రం తరువాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న  క్రియేటివ్ డైరెక్టర్  కృష్ణ వంశీ  కొద్దీ రోజుల క్రితం  తన కొత్త ప్రాజెక్ట్ ను  ప్రకటించారు.  గత కొన్నేళ్లు గా సరైన హిట్ లేక  వెనుకబడి పోయిన ఈ డైరెక్టర్  మళ్ళీ  ఎలాగైనా ఫామ్ లోకి రావాలని  ఈ సారి ఆయన  మరాఠీ  రీమేక్ ను నమ్ముకున్నాడు.  2016లో  విడుదలై  సూపర్ హిట్  అయిన  మరాఠా కల్ట్ మూవీ 'నట్  సామ్రాట్' ను  తెలుగులో రీమేక్ చేయనున్నాడు కృష్ణవంశీ. 



ఒరిజినల్ వెర్షన్ ను  ప్రముఖ నటుడు  మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేయగా  నానా పటేకర్ లీడ్ రోల్ లో నటించాడు .  ఈసినిమా  ఉత్తమ  మరాఠి చిత్రంగా అవార్డు ను గెలుచుకుంది.  ఇక ఇప్పుడు ఈ ఈచిత్రం తెలుగులో రంగమార్తాండ అనే టైటిల్ తో రీమేక్ కానుంది.  ఈ రీమేక్ లో  విలక్షణ నటుడు  ప్రకాష్ రాజ్ ,కృష్ణ వంశీ సతీమణి  రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో  నటించనుండగా  తాజాగా మరో కీలక పాత్ర కోసం  ప్రముఖ యాంకర్ కమ్ నటి  అనసూయను కూడా  తీసుకున్నారని సమాచారం. 



రంగస్థలం తో నటిగా నిరూపించుకున్న అనసూయకు ఆ సినిమా తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. మరి  ఈ రంగమార్తాండ  ఆమె కెరీర్ కు ఏవిధంగా ప్లస్ అవుతుందో చూడాలి. అనసూయ తో పాటు హ్యాపీడేస్ ఫేమ్  వంశీ చాగంటి కూడా ఈ చిత్రంలో  నటించనున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా  గురించి మరిన్ని వివరాలు వెలుబడున్నాయి. రెడ్ బుల్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై అభిషేక్ జ్వకర్ , మధు కలిపు నిర్మించనున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: