పవన్
కళ్యాణ్ కు ఒక కథ వినిపించి అతడిని ఆ కథకు ఓకె చెప్పించడం అంత సులువైన పని కాదు. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య బోనీకపూర్ ప్రత్యేకంగా
పవన్ కోసం హైదరాబాద్ వచ్చి దాదాపు ఒక గంట సేపు ఏ విషయం గురించి మాట్లాడాడు అన్న విషయమై ఇప్పుడు పలు ఊహాగానాలు వస్తున్నాయి.
బాలీవుడ్ లో విడుదలైన ‘పింక్’ సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు దాని తెలుగు వెర్షన్ రీమేక్ కు జరుగుతున్న ప్రయత్నాలలో బోనీకపూర్ దిల్ రజ్ తో చేతులు కలిపి ఈమూవీ రీమేక్ కోసం
పవన్ తో చర్చలు సాగిస్తున్నాడు అన్నవార్తలు ఇప్పటికే వచ్చాయి.
అంతేకాదు హిందీలో ‘పింక్’ సినిమాలో
అమితాబ్ పాత్ర
పవన్ కు అన్నివిధాల సరిపోతుందని ఒక సామాజిక స్పృహతో కూడుకున్న కథ కావడంతో
పవన్ భావజాలానికి ఈకథ
పవన్ కు అన్నివిధాల సరిపోతుందనీ
పవన్ ను బోనీకపూర్ తన మాటల మాయతో పడేసినట్లు ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీనితో
పవన్ ‘పింక్’ రీమేక్ లో నటించడం ఖాయం అంటూ ఆపత్రిక పతాక శీర్షికలో ఒక వార్తను ప్రచురించింది.
అంతేకాదు ‘బ్రోచేవారు ఎవరురా’ మూవీని డైరెక్ట్ చేసిన
వివేక్ ఆత్రేయతో
పవన్ కళ్యాణ్ ఈమూవీ స్క్రిప్ట్ వ్రాయించమని చెప్పాడని ప్రస్తుతం ఈయంగ్ డైరెక్టర్ ఈపనిలో బిజీగా ఉన్నట్లు ఆకథనంలో పేర్కొనబడింది. ఇప్పుడు ఈవార్త వైరల్ కావడంతో
పవన్ అభిమానులు ఈన్యూస్ ను చూసి గగ్గోలు పెడుతున్నట్లు టాక్.
పవన్ కు పింక్ లోని
అమితాబ్ పాత్ర ఏమాత్రం సరిపోదని ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అయి ఆతరువాత ఎన్నికలలో ఓడిపోయి వరస పరాజయాలు చూసిన
పవన్ కళ్యాణ్ కు ‘పింక్’ మరో పరాజయాన్ని ఇస్తుంది భావిస్తూ
పవన్ కు ఈఆలోచన మానుకోమని వేల సంఖ్యలో మెసేజ్ లు పెడుతున్నట్లు తెలుస్తోంది..