సామాన్యంగా వివాదాలకు దూరంగా ఉండే వెంకీ ఒక దర్శకుడుని తన వద్దకు పిలిపించుకుని అతడి పై విరుచుకు పడ్డాడు అనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీల్‌తో 'భీమవరం బుల్లోడు' సినిమాని తీసిన దర్శకుడు ఉదయశంకర్‌ ఈ చిత్రాన్ని ముందుగా వెంకటేష్‌తో తీద్దామని అనుకున్నాడట సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఆస్థాన దర్శకుడిగా పేరుగాంచిన ఉదయశంకర్‌ ఇంతకుముందు వెంకీతో ‘కలిసుందాంరా’ సినిమా చేసాడు. ఈ సినిమా ఆరోజులలో సూపర్ హిట్. దాని తరువాత కొంత గేప్ తీసుకున్న ఈ దర్శకుడు వెంకటేష్‌తో మరోసారి పని చేద్దామని 'భీమవరం బుల్లోడు' కధ చెపితే ఆ కధ వెంకటేష్ కు నచ్చినా ఆ సినిమా చేయనని చెప్పేసాడట. దానితో దర్శకుడు ఉదయశంకర్ వెంకటేష్ ను కారణం అడిగితే ఈ సినిమాలో చాలా ఛేజ్‌లు, ఫైట్‌లు ఉంటాయని, తానీ వయసులో అంత స్ట్రెయిన్‌ కాలేనని వెంకటేష్‌ చెప్పాడట. ఇదే విషయాన్ని ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉదయశంకర్‌ ఈ విషయం చెప్పాడు. కాని అలా వాస్తవం ఉదయశంకర్ చెప్పడం వెంకటేష్‌కి నచ్చలేదట. సినిమా ఎందుకు చేయలేదంటే వేరే కారణాలు చెప్పాలి కానీ ఏజ్‌ ఫ్యాక్టర్‌ కారణమని మీడియాకి చెప్తారా అని వెంకటేష్‌ అసహసనం వ్యక్తం చేయడమే కాకుండా ఈ దర్శకుడి పై మాటలతో విరుచుకు పడ్డాడని టాక్. అయితే వెంకటేష్‌ ఈమధ్యన చేసిన మసాలా, షాడో చిత్రాల్లో కూడా ఛేజ్‌లు,ఫైట్లు ఉన్నాయి. మరి వాటిలో నటించిన వెంకీకి ఈ విషయం గుర్తుకు రాలేదా అంటు వెంకటేష్ పై సెటైర్లు పడుతున్నాయి. ఎదిఎమైనా వెంకీ వదులుకున్న సినిమా ఈ వారం సునీల్ కు ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: